News April 7, 2025
వైఎస్ జగన్ రాప్తాడు పర్యటన రూట్ మ్యాప్ ఇదే!

మాజీ సీఎం వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గ పర్యటన రూట్ మ్యాప్ వెలువడింది. రేపు ఆయన రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి రానున్నారు. ఉదయం 10.40 గంటలకు హెలికాప్టర్లో సీకే పల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన పాపిరెడ్డిపల్లికి వెళ్తారు. ఇటీవల ప్రత్యర్థుల దాడిలో దారుణ హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరుకు బయలుదేరనున్నారు.
Similar News
News April 19, 2025
అనంతపురం జిల్లాలో 72 అటెండర్ పోస్టులు

అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 72 అటెండర్ పోస్టుల భర్తీకి సర్వం సిద్ధం చేశామని DMHO దేవి తెలిపారు. ఇందులో MRI, MRN, OT టెక్నీషియన్లు, ఫిజియోథెరపిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, స్పీచ్ థెరపిస్ట్, నెట్ అడ్మినిస్ట్రేటర్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, పెర్ ప్యూజినిష్ట్, అటెండర్ పోస్టులు ఉన్నాయన్నారు. 2023 నవంబర్లో వచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు.
News April 19, 2025
అనంత: స్వర్ణాంధ్ర కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష

అనంతపురంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం సాయంత్రం అన్ని శాఖలతో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వర్ణ ఆంధ్రా- స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమం నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ జరిగిందన్నారు. గ్రామస్థాయిలో పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News April 18, 2025
MEMU రైలు అనంతపురం వరకు..

అనంతపురం జిల్లా ప్రజలకు రైల్యే శాఖ తీపి కబురు చెప్పింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుంచి బెంగళూరుకు నడుస్తున్న MEMU రైలును అనంతపురం వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ రైలు అనంతపురం-బెంగళూరు మధ్య పరుగులు పెట్టనుంది. KSR బెంగళూరులో ఉ.8.35 గంటలకు బయలు దేరి అనంతపురానికి మ.1.55 గంటలకు చేరుకుంటుంది. తిరిగి అనంతలో మ.2.10 గంటలకు బయలుదేరి రాత్రి 7.50 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.