News April 10, 2025

వైఎస్ జగన్ రామగిరి పర్యటన.. కేసు నమోదు

image

మాజీ సీఎం వైఎస్ జగన్ రామగిరి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద పోలీసుల మీద దాడి ఘటనపై కేసు నమోదైంది. వైసీపీ శ్రేణులు హెలికాప్టర్ వద్దకు దూసుకెళ్లగా అడ్డుకోబోయిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ రంగారెడ్డి అస్వస్థతకు గురై అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు సీకేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News November 27, 2025

NZB: మొదలైన నామినేషన్ల దాఖలు పర్వం

image

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతలో జరిగే ఎన్నికలకు సంబంధించి గురువారం నామినేషన్ ల దాఖలు పర్వం మొదలైంది. తొలి దశ ఎన్నికలు జరిగేబోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, ఎడపల్లి, నవీపేట మండలాల్లో 184 సర్పంచ్, 1642 వార్డు మెంబర్లకు జరిగే GP ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు గురువారం ఉదయం నామినేషన్ లు దాఖలాలు చేయడం మొదలుపెట్టారు.

News November 27, 2025

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో KCR మాజీ ఓఎస్డీ విచారణ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ CM KCR వద్ద OSDగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని జూబ్లీహిల్స్ PSలో సిట్ విచారిస్తోంది. దీంతో ఆయన ఎలాంటి సమాచారం ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. INC ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దృష్టి సారించింది. ఈ కేసులో మాజీ IPS ప్రభాకర్ రావును సుదీర్ఘంగా విచారించింది. పలువురు రాజకీయ ప్రముఖుల వాంగ్మూలాలను సిట్ రికార్డ్ చేసింది.

News November 27, 2025

CUA మహా మాస్టర్ ప్లాన్‌: 27 మున్సిపాలిటీలకు కొత్త చట్టాలు!

image

GHMCకి అనుబంధంగా ఉన్న 27 మున్సిపాలిటీల కోసం కోర్ అర్బన్ ఏరియా (CUA) మాస్టర్ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే HMDA మాస్టర్ ప్లాన్ 2050, 56 గ్రామాలకు FCDA ప్లాన్‌లు పూర్తవగా నోటిఫికేషన్ ఈ వారమే విడుదల కానుంది. ఇక CUA ప్లాన్ కోసం, ప్రత్యేకంగా జోనల్ రెగ్యులేషన్స్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ రూల్స్‌ను రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. త్వరలో CMతో సమావేశమై చర్చించనున్నట్లు తెలిసింది.