News April 4, 2025

వైఎస్ షర్మిలతో పులివెందుల ఇన్‌ఛార్జ్ భేటీ

image

పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మూలంరెడ్డి ధ్రువకుమార్‌రెడ్డి గురువారం విజయవాడలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుశారు. అనంతరం పార్టీ పురోగతి, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ భేటీ నేపథ్యంలో పార్టీ బలోపేతానికి అవసరమైన వ్యూహాలను అమలు చేయడానికి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News October 17, 2025

కడప: బిడ్డకు జన్మనిచ్చిన 16 ఏళ్ల బాలిక

image

ఈ ఘటన కడప జిల్లా దువ్వూరు మండలంలో వెలుగు చూసింది. ఓ గ్రామానికి చెందిన చెంచయ్యగారి ప్రసాద్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే ఊరికి చెందిన 16 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో వేధించాడు. చంపుతానని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలికకు గర్భం రావడంతో అబార్షన్ చేయించాలని ప్రయత్నించాడు. ఈక్రమంలో జులైలో నిందితుడిపై పోక్సో కేసు కింద నమోదు చేశారు. ఆ బాలిక ఇవాళ తెల్లవారుజామున బిడ్డకు జన్మనిచ్చింది.

News October 16, 2025

కడప: ఈ టేస్ట్ ఎక్కడా రాదండోయ్.!

image

కడప జిల్లా అంటే ఫ్యాక్షన్ కాదండీ. నోరూరించే వంటకాలు కూడా మా సొంతం. ఇక్కడ రాగి సంగటి-నాటుకోడి ఫేమస్. అంతేకాందండోయ్.. ఉగ్గానిలోకి మిరపకాయ బజ్జి తింటే ఆహా అనాల్సిందే. ఇక చెన్నూరు బిర్యానీ, గువ్వల చెరువు పాలకోవ, జమ్మలమడుగులో దొరికే కుష్కాను ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందే. ఇక దోశపై కారం పట్టించి.. కాస్త పప్పుల పొడి వేసి తింటే నోరూరాల్సిందే. ఇక పొంగనాలు తినని కడప జిల్లా వాసి ఉండరు.
#ప్రపంచ ఆహార దినోత్సవం

News October 15, 2025

జమ్మూలో కడప జిల్లా జవాన్ మృతి.!

image

కడప జిల్లా వేంపల్లి మండలం ముత్తుకూరుకు చెందిన BSF జవాన్ చపాటి నవీన్ (28) జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల ప్రాంతంలో అకస్మికంగా మృతి చెందారు. దీంతో మంగళవారం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అధికార లాంఛనాలతో అంతక్రియలు నిర్వహించారు. కుటుంబాన్ని పోషించే కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.