News March 18, 2025

వైకల్యాన్ని ఓడించి..ఉద్యోగం సాధించి..! అంతే గాక..

image

ప్రతిభకు అంగవైకల్యం అడ్డురాదని నిరూపించారు జుక్కల్ మండలం మొహ్మదాబాద్ వాసి ముక్తబాయి. పుట్టుకతోనే అంధురాలు ఉన్నా.. ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదలతో ఇటీవల గ్రూప్ 4 కు ఎంపికయ్యారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంచర్ల రెసిడెన్షియల్ పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. అంతే గాక తన పించన్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీడీవోకు వినతి పత్రం అందించి ఆదర్శంగా నిలిచారు.

Similar News

News October 20, 2025

ESIC ఇండోర్‌లో 124 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ESIC ఇండోర్‌లో 124 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి MBBS/MD/MSతో పాటు పని అనుభవం గలవారు ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. అక్టోబర్ 29, 30, 31 తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. వెబ్‌సైట్: https://esic.gov.in/recruitments

News October 20, 2025

18 నెలల్లో ఒక్క దీపమైనా వెలిగిందా: జగన్

image

AP: కూటమి ప్రభుత్వం ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో 18 నెలల్లో ఒక్కటైనా వెలిగిందా అని YS జగన్ ప్రశ్నించారు. ‘రూ.3వేల నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1500, రైతులకు ఏడాదికి రూ.20,000, పిల్లలకు ఏటా రూ.15,000, ఇంటింటికీ ఏటా 3 ఉచిత సిలిండర్లు, ఉద్యోగులకిచ్చిన హామీలు.. ఇవన్నీ వెలగని దీపాలే కదా?’ అని ట్వీట్ చేశారు. తామందించిన 30 పథకాలు అనే దీపాలను ఆర్పేసి చీకటికి ప్రతినిధులయ్యారంటూ విమర్శించారు.

News October 20, 2025

REWINED.. వరంగల్‌లో ఇదే తరహా తిరుగుబాటు..!

image

నిజామాబాద్‌లో రియాజ్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ తరహాలోనే జనగామలో కూడా ఎస్కార్ట్ పోలీసులపై తిరగబడ్డ ఐదుగురు ఉగ్రవాదులను కాల్చి చంపిన ఘటన 2015 ఏప్రిల్ 7న జరిగింది. ఐఎస్ఐ ఉగ్రవాదిగా ఉన్న వికారోద్దీన్‌ను హైదరాబాద్ కోర్టుకు తరలిస్తుండగా జనగామ ప్రాంతంలో మల విసర్జన కోసం ఆగారు. ఆ సమయంలో పోలీసులపై తిరుగుబాటు చేయడంతో కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందారు.