News April 10, 2025

వైద్యుల నిర్లక్ష్యంతో గర్భస్థ శిశువు మృతి: బాధితులు

image

వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు తాండూరు ఆరోగ్య కేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. వారి వివరాలిలా.. తాండూరు మం. గౌతపూర్‌కి చెందిన ఆశమ్మ పురిటినొప్పులతో తాండూరు MCHలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భంలో శిశువు గుండె కొట్టుకోవడం లేదని స్కానింగ్‌కు బయటకు పంపించారు. స్కానింగ్ చేసుకుని ఆసుపత్రికి రాగా గర్భంలోనే శిశువు మృతి చెందిందని వైద్యులు తెలిపారు.

Similar News

News October 18, 2025

దోమకొండ టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్

image

దోమకొండకు చెందిన దేవరగట్టు బాలప్రసాద్ 17 ఏళ్ల కృషికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కింది. తన ఆలోచనలను, సాంకేతికతను, మానవత్వాన్ని జోడించి నాయకుడిగా ఉద్యోగులను చేర్చాడు. ఖచ్చితమైన విశ్వాసంతో జనరేటివ్ AI హ్యాకథాన్ మార్పుతో కోడర్‌గా, సృష్టికర్తగా స్వీకరించి, యాప్‌గా కాకుండా మిషన్‌గా భావించాడు. జీవితంలో ప్రేరణ అనేది చాలా ముఖ్యమని ఆయన అన్నారు.

News October 18, 2025

ఆత్మహత్యకు కారకులైన నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష

image

భూవివాదంలో వ్యక్తిని బెదిరించి ఆత్మహత్యకు కారణమైన 8మంది నిందితులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కిరణ్ కుమార్ శుక్రవారం తీర్పు చెప్పారు. అశ్వాపురం(M) మొండికుంటకు చెందిన గూడూరు శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు సీఐ రాజు కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టులో సాక్షులను విచారించగా నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.

News October 18, 2025

డిప్యుటేషన్లకు దరఖాస్తు చేసుకోండి: KMR DEO

image

ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి ఇంటర్‌ లోకల్ కేడర్ తాత్కాలిక డిప్యుటేషన్లు/బదిలీలకు ప్రభుత్వం అనుమతించిందని కామారెడ్డి DEO రాజు శుక్రవారం తెలిపారు. ఈ బదిలీలకు అర్హత కలిగిన ఉపాధ్యాయులు, బోధనేతర ఉద్యోగులు OCT 17 నుంచి OCT 24 వరకు schooledu.telangana.gov.in పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. దరఖాస్తు కాపీల (2 సెట్లు) సంబంధిత పత్రాలతో OCT 25 లోపు DEO కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.