News February 6, 2025
వైద్య శిబిరాన్ని సందర్శించిన ములుగు కలెక్టర్

ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ మేడారం మినీ జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన టీటీడీ కళ్యాణ మండపంలోని ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపంలోని ఏర్పాటు చేసిన పడకలను మందుల వివరాలను డీఎంహెచ్వో డా.గోపాలరావును అడిగి తెలుసుకున్నారు. మినీ జాతరకు వస్తున్న భక్తులకు వైద్యం పట్ల అసౌకర్యాలు కలగకుండా వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలు, అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలన్నారు.
Similar News
News December 7, 2025
వంటింటి చిట్కాలు

* పనీర్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే బ్లాటింగ్ పేపర్లో పెట్టి ఫ్రిజ్లో పెట్టండి.
* ఇంట్లో తయారు చేసిన స్వీట్స్లో షుగర్ మరీ ఎక్కువైతే.. కాస్త నిమ్మరసం కలపండి. కాస్త తీపి తగ్గుతుంది. అలాగే వెనిగర్ కూడా వాడొచ్చు.
* వంట చేసినప్పుడు చేతులు కాలితే బంగాళదుంపతో రుద్దితే మంట తగ్గుతుంది.
* కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల పొడి వేస్తే మరింత రుచిగా ఉంటుంది.
News December 7, 2025
పులివెందులలో YS జార్జిరెడ్డికి విజయమ్మ నివాళి.!

మాజీ ముఖ్యమంత్రి YSR సోదరుడు వైయస్ జార్జిరెడ్డి వర్ధంతి ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ సమాధుల తోటలో వైయస్ జార్జిరెడ్డి సమాధితోపాటు రాజారెడ్డి, వివేకానందరెడ్డి సమాధుల వద్ద పూలమాలలు పెట్టి వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ నివాళులర్పించారు. అనంతరం పులివెందులలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.
News December 7, 2025
సిమ్ కార్డులతో నేరాలు చేస్తున్న ప్రకాశం జిల్లా వాసి.!

ఇతరుల వద్ద ఫోన్ తీసుకొని సిమ్ కార్డులను మారుస్తూ, ఓటీపీల సాయంతో నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు చీమకుర్తి సీఐ ప్రసాద్ తెలిపారు. గతనెల 29న అందిన ఫిర్యాదు మేరకు SP హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో దర్యాప్తు సాగిందన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శేషయ్య ఓటీపీల సహాయంతో వచ్చిన డబ్బులను బెట్టింగ్ యాప్లకు వాడినట్లు గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. ఇతనివద్ద రూ.2,60,000 రికవరీ చేసినట్లు తెలిపారు.


