News February 6, 2025

వైద్య శిబిరాన్ని సందర్శించిన ములుగు కలెక్టర్

image

ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ మేడారం మినీ జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన టీటీడీ కళ్యాణ మండపంలోని ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపంలోని ఏర్పాటు చేసిన పడకలను మందుల వివరాలను డీఎంహెచ్వో డా.గోపాలరావును అడిగి తెలుసుకున్నారు. మినీ జాతరకు వస్తున్న భక్తులకు వైద్యం పట్ల అసౌకర్యాలు కలగకుండా వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలు, అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలన్నారు.

Similar News

News March 23, 2025

SUNDAY.. HYDలో ఫ్యాన్స్ జోరు..!

image

హాలిడే రోజు HYD హోరెత్తనుంది. క్రికెట్ ఫ్యాన్స్‌ కోసం ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. గతేడాది సిక్సర్ల మోతతో హోమ్ గ్రౌండ్‌లో రికార్డులు సృష్టించిన SRH ఈ సీజన్‌లో కూడా విధ్యంసం సృష్టిస్తుందని హైదారాబాదీలు ఎదురుచూస్తున్నారు. ‘IPL-18’లో నేడు SRH.. RRతో తలపడనుంది. ఉప్పల్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను హబ్సిగూడ X రోడ్ వద్ద మళ్లిస్తారు. రామంతాపూర్ నుంచి వచ్చే వాహనాలు స్ట్రీట్ నం.8 ద్వారా UPL X రోడ్‌కు మళ్లిస్తారు.

News March 23, 2025

చింతపల్లి: జిల్లాలో ఈనెల 26 వరకు తేలికపాటి వర్షాలు

image

అల్లూరి జిల్లాలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి శనివారం తెలిపారు. ఈనెల 26వ తేదీ వరకు చింతపల్లి, పాడేరు, అరకులోయ, రంపచోడవరం డివిజన్ల పరిధిలో కనిష్ఠంగా 0.5 మిల్లీమీటర్ల నుంచి గరిష్ఠంగా 2.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుందన్నారు.

News March 23, 2025

గుత్తిలో కేజీ చికెన్ రూ.170

image

అనంతపురం జిల్లా గుత్తిలో కేజీ చికెన్ ధర రూ.170-180లుగా ఉంది. గుంతకల్లులో కిలో రూ.150-160 చొప్పున అమ్ముతున్నారు. ఇక అనంతపురంలో కేజీ రూ.140-150లతో విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకులు తెలిపారు. గత ఆదివారంతో పోల్చితే నేడు చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తి, గుంతకల్లులో కేజీ మటన్ ధర రూ.700-750లుగా ఉంది.

error: Content is protected !!