News March 18, 2025
వైభవంగా సీతారామచంద్ర స్వామి నిత్య కళ్యాణం

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో మంగళవారం నిత్య కళ్యాణం వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తుల సందడి మధ్య శ్రీరాముడి కళ్యాణాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ హారతులు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
Similar News
News February 23, 2026
నాగర్కర్నూల్: ‘బిడ్డ ఆత్మ ఘోష వినిపించడం లేదా?’

కుల వివక్షకు బలైన పసి బిడ్డ ఆత్మ ఘోష పాలకులకు వినిపించడం లేదా అని పలు ప్రజాసంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ‘ధర్నా చేసే దాకా కేసులు పెట్టరు, ఆందోళన చేసే వరకు నిందితులను అరెస్ట్ చేయరు, ఇదేనా ప్రజాస్వామ్యం’ అని మండిపడుతున్నారు. పసి బిడ్డకు న్యాయం చేయలేని ప్రభుత్వాలు ఉండి ఏం లాభమని, వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆగిన చిన్ని గుండెకు శాంతి చేకూర్చాలని కోరుతున్నారు.
News February 23, 2026
27 ఏళ్ల తర్వాత రేపే తొలిసారి

కేంద్ర ఎన్నికల సంఘం రేపు ఢిల్లీలోని భారత్ మండపంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల కమిషనర్లతో జాతీయ సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సు జరగడం గత 27 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరగా 1999లో ఈ మీటింగ్ నిర్వహించారు. చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణలో ECI, SECల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం దీని ఉద్దేశం. ఎన్నికల చట్టాలు, EVMలు తదితర అంశాలపై ఇందులో చర్చిస్తారు.
News February 23, 2026
HYD: ఇకపై అలాంటివారిని పట్టిస్తే రూ.200/-

మీ వీధిలో ఎవరైనా మోటారు పెట్టి సంపులు పొంగిస్తున్నారా? పైపు లీకేజీని పట్టించుకోకుండా వదిలేస్తున్నారా? అయితే వెంటనే అలర్ట్ అవ్వండి. మార్చి మొదటి వారం నుంచి HMWSSB అందుబాటులోకి తెస్తున్న ‘పానీ యాప్’ ద్వారా నీటి వృథాను ఫొటో తీసి అప్లోడ్ చేయండి. అధికారులు IP అడ్రస్ ద్వారా నిందితులను గుర్తించి వెంటనే జరిమానా విధిస్తారు. ఇలా నీటిని ఆదా చేసినందుకు మీకు రూ.200ల నగదు ప్రోత్సాహకం కూడా లభిస్తుంది.


