News June 17, 2024
వైయస్ జగన్ కడప జిల్లా పర్యటన వాయిదా

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటన వాయిదా పడింది. రేపటినుండి 5 రోజులు పాటు జిల్లాలో ఇడుపులపాయతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటన ఉండగా..19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉన్న కారణంగా పర్యటనను వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News July 7, 2025
అర్జీలు స్వీకరించిన కడప ఎంపీ

పులివెందులలోని తన నివాసంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని కోరారు.
News July 7, 2025
పులివెందుల: స్తంభంపైనే చనిపోయాడు

పులివెందులలో విషాద ఘటన జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని ఉలిమెళ్ల సమీపంలో కరెంట్ పనులు చేయడానికి లైన్మెన్ శివారెడ్డి ఎల్సీ తీసుకున్నాడు. స్తంభంపై పనిచేస్తుండగా షాక్ కొట్టడంతో అక్కడే చనిపోయాడు. అధికారుల నిర్లక్ష్యంతో కరెంట్ సరఫరా జరిగిందా? వేరే కారణమా? అనేది తెలియాల్సి ఉంది.
News July 7, 2025
20 నుంచి కడపలో రక్తదాన శిబిరాలు

రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణ పోయవచ్చని బీజేపీ కడప జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నెహ్రూ యువ కేంద్రం, మై భారత్ ఆధ్వర్యంలో రక్తదాన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కడపలోని రెడ్క్రాస్ కార్యాలయం, రిమ్స్ ఆసుపత్రి, ప్రభుత్వ కాలేజీ ప్రాంగణాల్లో జులై 20 నుంచి 26వ తేదీ వరకు రక్తదాన శిబిరాలు జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్నవారు రక్తదానం చేయాలని కోరారు.