News February 13, 2025
వైసీపీటీఏ డైరీ ఆవిష్కరించిన వైఎస్ జగన్

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ వైఎస్సార్టీఏ అధ్యక్షులు అశోక్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సుధీర్, గౌరవ అధ్యక్షులు జాలిరెడ్డితో పాటుగా 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైసీపీటీఏ డైరీని జగన్ ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యల గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు.
Similar News
News January 10, 2026
నేటి విద్యార్థులే రేపటి భారత నిర్మాతలు: మంత్రి అనిత

నేటి విద్యార్థులే రేపటి భావి భారత నిర్మాతలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వడ్డేశ్వరంలోని KL University ఆవరణలో శనివారం జరిగిన స్టూడెంట్ ఇంటరాక్టివ్ మీట్లో ఆమె పాల్గొని, విద్యార్థులతో నేరుగా మమేకమయ్యారు. ఇంజినీరింగ్ మొదటి విడత ఫలితాలను విడుదల చేశారు. ఫిబ్రవరి 23న జరగనున్న ఇంటర్నేషనల్ ఉమెన్ సమ్మిట్ పోస్టర్తో పాటు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నీ పోస్టర్ను ఆవిష్కరించారు.
News January 10, 2026
GNT: మధ్యాహ్నం టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలెప్మెంట్పై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. అక్కడ ప్రజలు కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News January 10, 2026
GNT: ప్రముఖ జర్నలిస్ట్, రచయిత డి. ఆంజనేయులు

జర్నలిస్ట్ ధూళిపూడి ఆంజనేయులు (డి.ఎ) సాహితీ లోకానికి చిరపరిచితులు. గుంటూరు జిల్లా యలవర్రులో 1924 జనవరి 10న జన్మించిన ఆయన, ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి పత్రికల్లో పనిచేశారు. ఆకాశవాణి ‘వాణి’ పత్రికకు సంపాదకత్వం వహించారు. తెలుగు సాహిత్యాన్ని, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి కవితలను ఆంగ్లంలోకి అనువదించి ఇతర ప్రాంతాల వారికి పరిచయం చేశారు. కందుకూరి, సి.ఆర్.రెడ్డి జీవిత చరిత్రలు రచనలు చేశారు.


