News February 13, 2025

వైసీపీటీఏ డైరీ ఆవిష్కరించిన వైఎస్ జగన్

image

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ వైఎస్సార్టీఏ అధ్యక్షులు అశోక్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సుధీర్, గౌరవ అధ్యక్షులు జాలిరెడ్డితో పాటుగా 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైసీపీటీఏ డైరీని జగన్ ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యల గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు.

Similar News

News March 22, 2025

గుంటూరు జిల్లాలో ఉగాది పురస్కారాలు వీరికే..

image

గుంటూరు జిల్లాలో పోలీస్ శాఖకు చెందిన పలువురికి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలు అందజేయనుంది. వారిలో తాడేపల్లి సిఐడి అడిషనల్ ఎస్పీ జయరామరాజు మహోన్నత సేవా పతాకం అవార్డు అందుకోనున్నారు. ఉత్తమ సేవా పురస్కారానికి హెడ్ కానిస్టేబుల్ పిచ్చయ్య, APSP 6వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ హనుమంతు, ARSI ఉదయ కుమార్, PCలు శివప్రసాద్, విరుపాక్ష ఎంపికయ్యారు. తెనాలి ఎస్ఐ శ్రీనివాసరావుకు సేవా పురస్కారం వరించింది.

News March 22, 2025

GNT: సీఎంవోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

సీఎంవోలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టుల భర్తీకి శనివారం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సీఎంవోలో పనిచేయడానికి ఫోటోగ్రాఫర్లు-3, వీడియోగ్రాఫర్లు-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వీరికి నెలకు రూ.70,000 వేతనం చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News March 22, 2025

గుంటూరు జిల్లాలో ఈగల్ తనిఖీలు

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులపై ఈగల్ సిబ్బంది దాడులను శుక్రవారం నిర్వహించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న షాపులు.. గుంటూరులో రెండు, తెనాలిలో షాపులను ఈగల్ సిబ్బంది సీజ్ చేశారు. ఈగల్ అధికారులు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో తనిఖీలు కొనసాగుతాయని, డ్రగ్స్ దుర్వినియోగంపై దాడులు నిర్వహిస్తామన్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!