News September 27, 2024

వైసీపీని గెలిపించలేదనే పడవల కుట్ర: నిమ్మల

image

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాలేదనే అక్కసుతో 3 బోట్లను, లింక్ చేసి వదిలి ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేయాలని జగన్ కుట్ర పన్నాడని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు నియోజకవర్గం కొంతేరులో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో నిమ్మల పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గర్భిణులకు సాముహిక సీమంతాలు చేసి, చీర, గాజులు, పసుపు, కుంకుమ అందించి ఆశీర్వదించారు.

Similar News

News February 26, 2026

తణుకు: కేబుల్ వైరు మెడకు తగిలి.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

image

సిబ్బంది నిర్లక్ష్యం ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. తణుకు మండలం తేతలి వద్ద బుధవారం రాత్రి బైకుపై వెళ్తున్న వడ్లూరుకు చెందిన రాంబాబు మెడకు ఇంటర్నెట్ కేబుల్ వైర్లు చుట్టుకున్నాయి. మరమ్మతులు చేస్తున్న సమయంలో సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యలు ఆరోపించారు. మెడ భాగంలో గాయాలైన రాంబాబును చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News February 26, 2026

ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

జిల్లాలో ఎంపిక చేసిన 30 రైస్ మిల్లుల ఆకస్మిక తనిఖీలపై కలెక్టర్ నాగరాణి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం పెదమిరం క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన గూగుల్ మీట్‌లో ఆమె మాట్లాడారు. సీఎంఆర్ బియ్యం సరఫరాలో జాప్యం, వ్యత్యాసాలను సహించేది లేదన్నారు. ఎఫ్‌సీఐ, సివిల్ సప్లైస్ విభాగాలకు నిర్దేశిత గడువులోగా బియ్యం అందించాలని, విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మిల్లర్లను హెచ్చరించారు.

News February 26, 2026

ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

జిల్లాలో ఎంపిక చేసిన 30 రైస్ మిల్లుల ఆకస్మిక తనిఖీలపై కలెక్టర్ నాగరాణి అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం పెదమిరం క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన గూగుల్ మీట్‌లో ఆమె మాట్లాడారు. సీఎంఆర్ బియ్యం సరఫరాలో జాప్యం, వ్యత్యాసాలను సహించేది లేదన్నారు. ఎఫ్‌సీఐ, సివిల్ సప్లైస్ విభాగాలకు నిర్దేశిత గడువులోగా బియ్యం అందించాలని, విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మిల్లర్లను హెచ్చరించారు.