News February 2, 2025
వైసీపీపై రెచ్చిపోయిన నాగబాబు

పుంగనూరులోని సోమల జడ్పీ హై స్కూల్ మైదానంలో ఆదివారం ‘జనంలోకి జనసేన’ కార్యక్రమంలో వైసీపీపై జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. అప్పుడే వైసీపీ గూండాలు, సన్నాసులు ఇంకా అవి చేయలేదు, ఇవి చేయలేదని అంటున్నారు. ఇప్పటికే తాము పెన్షన్ పెంపు, ఏడాదికి మూడు సిలిండర్లు, రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాలు, డీఎస్సీ, పోలీస్ పోస్టులకు చర్యలు చేపట్టాం’ అని పేర్కొన్నారు.
Similar News
News December 7, 2025
గోవాకు వెళ్తున్నారా? జాగ్రత్త

2023లో HYD యువతి (30) పెళ్లికి ముందు ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లింది. అక్కడ బస ఏర్పాట్లు చేసిన యశ్వంత్ అనే వ్యక్తి తాజాగా తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియుడితో గడిపిన వీడియోలను రికార్డు చేశానని, రూ.30 లక్షలు ఇవ్వకుంటే బయటపెడతానని బెదిరిస్తున్నాడని పేర్కొంది. తనకు వేరే వ్యక్తితో పెళ్లి అయిందని చెప్పినా వినట్లేదని వాపోయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News December 7, 2025
టెన్త్, ఇంటర్ అర్హతతో NGRIలో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (<
News December 7, 2025
మీ పిల్లలను ఇలా మోటివేట్ చేయండి

పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత. “నా వల్ల కాదు” అని చెప్పే అలవాటు ఉంటే సరైన ప్రోత్సాహంతో దాన్ని మార్చవచ్చు. ఫలితాలకంటే ప్రయత్నాన్ని ప్రశంసించాలి. “నీవు చేయగలవు”, “మళ్లీ ప్రయత్నించు” అని చెప్తే సానుకూల దృక్పథంతో ఆలోచిస్తారు. వారికి చిన్నచిన్న నిర్ణయాలు సొంతంగా తీసుకునే అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల నమ్మకమే పిల్లల్లో ఆత్మవిశ్వాసానికి బలమైన పునాది అవుతుంది.


