News October 1, 2024

వైసీపీలో తాడేపల్లిగూడెం నాయకుడికి కీలక బాధ్యతలు

image

వైసీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వడ్డీ రఘురాం నాయుడును నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం తాడేపల్లిగూడెంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో రఘురాం నాయుడు ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన నియామకం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

Similar News

News November 26, 2025

ప.గో జిల్లా.. భారీ వర్షాలు.. హెచ్చరిక

image

ప.గో జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఈనెల 27 నుంచి డిసెంబర్ 1 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ సూచించినట్లు జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండి, పొలాల్లో తేమ పెరగకముందే వరి కోతకు సిద్ధం కావాలని ఆయన సూచించారు.

News November 26, 2025

పెనుగొండ ఇక ‘వాసవీ పెనుగొండ’

image

పెనుగొండ ఇకపై వాసవీ పెనుగొండగా మారనుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల మార్పులు, చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో సచివాలయంలో సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. ఈ మేరకు వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని పెనుగొండను వాసవి పెనుగొండగా మార్పు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఇక్కడ ప్రసిద్ధిగాంచిన విషయం తెలిసిందే.

News November 26, 2025

పెనుగొండ ఇక ‘వాసవీ పెనుగొండ’

image

పెనుగొండ ఇకపై వాసవీ పెనుగొండగా మారనుంది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల మార్పులు, చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో సచివాలయంలో సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్షించారు. ఈ మేరకు వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని పెనుగొండను వాసవి పెనుగొండగా మార్పు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఇక్కడ ప్రసిద్ధిగాంచిన విషయం తెలిసిందే.