News October 1, 2024

వైసీపీలో తాడేపల్లిగూడెం నాయకుడికి కీలక బాధ్యతలు

image

వైసీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వడ్డీ రఘురాం నాయుడును నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం తాడేపల్లిగూడెంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో రఘురాం నాయుడు ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన నియామకం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

Similar News

News November 17, 2025

ప్రజలకు సంతృప్తి కలిగేలా సమస్యల పరిష్కారం: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజల నుంచి 162 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని, తమ పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.

News November 17, 2025

ప్రజలకు సంతృప్తి కలిగేలా సమస్యల పరిష్కారం: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజల నుంచి 162 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని, తమ పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.

News November 17, 2025

పీఎంఏవై కింద ఇళ్ల మంజూరుకు త్వరపడండి: కలెక్టర్

image

గ్రామీణ ప్రాంతంలో సొంత స్థలం ఉన్న అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ గృహం మంజూరుకు త్వరపడాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం ద్వారా ఇళ్లు లేని పేదలకు గృహాలను మంజూరు చేస్తామని ఆమె తెలిపారు. ఈ నెల 30 లోగా అర్హులైన వారందరూ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.