News June 23, 2024
వైసీపీ ఆఫీసు కూల్చివేత దుర్మార్గం: ధర్మాన

తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ రాష్ట్ర కార్యాలయాన్ని కూల్చడం దుర్మార్గమైన చర్య అని ఆపార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ‘ఇది ముమ్మాటికీ కక్షపూరిత చర్య. ఉదయాన్నే భారీ పోలీసు బందోబస్తుతో ఆఫీసు కూల్చడం సరికాదు. ఈ కేసు కోర్టులో ఉన్నప్పటికీ ఇలా చేయడం ఏంటి? చట్టాన్ని అతిక్రమించకండి’ అని సీఆర్డీఏ అధికారులకు ఆయన సూచించారు.
Similar News
News September 19, 2025
SKLM: దివ్యాంగుల నుంచి ఫిర్యాదుల స్వీకరించిన కేంద్ర మంత్రి

దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని వినతులు స్వీకరించారు. శుక్రవారం శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో దివ్యాంగుల గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యల విని, పడుతున్న కష్టాలను చూసి ఆయన చలించిపోయారు. దివ్యాంగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్, JC, అధికారులు పాల్గొన్నారు.
News September 19, 2025
కోటబొమ్మాళి: రైలు ప్రమాదంలో ఒకరు మృతి

కోటబొమ్మాళి మండలం హరిచంద్రపురం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జిఆర్పీ హెడ్ కానిస్టేబుల్ మెట్ట సోమేశ్వరరావు శుక్రవారం తెలిపారు. మృతుడికి సుమారు 50 ఏళ్లు ఉంటాయన్నారు. వివరాలు తెలిసిన వారు పలాస జీఆర్పీ స్టేషన్కు తెలపాలన్నారు. 9492250069 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు.
News September 19, 2025
ఇచ్ఛాపురం: 100 ఏళ్లు జీవించి..మరొకరికి వెలుగునిచ్చారు

ఇచ్ఛాపురం పట్టణ మేజిస్ట్రేట్ పరేష్ కుమార్ అమ్మమ్మ విజయలక్ష్మి (100) గురువారం మృతి చెందారు. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. ఓ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్స్ సుజాత, కృష్ణలు ఆమె కార్నియాను సేకరించారు.