News March 12, 2025
వైసీపీ ఆవిర్భావ వేడుకల్లో కడప జిల్లా ఎమ్మెల్సీలు

తాడేపల్లెలో వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. అధినేత జగన్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైసీపీ లక్ష్యాలను ఆయన వివరించారు. వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా పార్టీ పెట్టినట్లు చెప్పారు. వైసీపీ వెన్నంటే నిలిచిన శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా ఎమ్మెల్సీలు రమేశ్ యాదవ్, రామ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
Similar News
News April 15, 2026
పోరుమామిళ్ల: ఇంటర్లో ఫెయిల్.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం

పోరుమామిళ్ల మండలానికి చెందిన విద్యార్థి ఇంటర్లో ఫెయిల్ అవడంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గుర్తించి పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్కు రిఫర్ చేశారు. డాక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థి తాగిన పాయిజన్ అత్యంత ప్రమాదకరమని, పరిస్థితి తీవ్రంగా ఉందని తెలిపారు.
News April 15, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15.360
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,131
* 10 గ్రాముల వెండి ధర రూ.2,520.
News April 15, 2026
కడప జిల్లాలో సెకండ్ ఇంటర్ ఫలితాలు యజమాన్యాల వారీగా ఇలా.!

కడప జిల్లాలో సెకండ్ ఇంటర్ ఫలితాలు యజమాన్యాల వారీగా ఇలా ఉన్నాయి.
✎ 20 ప్రభుత్వ కాలేజీల్లో 2002 మందికి గాను.. 1131 (56%) మంది పాస్
✎ 5 ఎయిడెడ్ల్లో 290 మందిలో 73 (25%)
✎ 9 HSPLUSల్లో 145 మందిలో 75 (48%)
✎ 3 మోడల్ కాలేజీల నుంచి 200 మందిలో 132 (66%)
✎ 11 APSWRల్లో 581 మందిలో 497 (86%)
✎ 16 KGBVల నుంచి 477 మందిలో 379 (79%).
✎ 71 ప్రైవేట్ కాలేజీల నుంచి 10201 మందిలో 7588 (74%) మంది పాస్ అయ్యారు.


