News June 13, 2024

వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని మాజీ సర్పంచ్‌ ఫిర్యాదు

image

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం నేపథ్యంలో బుధవారం తాము సంబరాలు చేసుకుంటుంటే వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని రావులపాలెం మండలం కేతరాజుపల్లె మాజీ సర్పంచి కాసా చాముండేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు గాయాలు కాగా.. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరినట్లు తెలిపారు. పోలీసులు వెళ్లి వివరాలు సేకరించారు. దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని సీఐ జేమ్స్ రత్నప్రసాద్ తెలిపారు.

Similar News

News November 26, 2025

హార్టికల్చర్ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన పురందీశ్వరి

image

రాజమండ్రి ఎంపీ డాక్టర్ దగ్గుబాటి పురందీశ్వరి బుధవారం రాజమండ్రి రూరల్ వేమగిరిలోని హార్టికల్చర్ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పరిశోధనలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నర్సరీ రైతు ఈ పరిశోధనా కేంద్రం ద్వారా ఉపయోగం పొందాలని ఆమె అన్నారు. ప్రతి నర్సరీ రైతు విధిగా తమ పేరును హార్టికల్చర్ ఏడీ ఆఫీసులో నమోదు చేసుకోవాలని సూచించారు.

News November 26, 2025

రాజమండ్రి: గోదావరి పుష్కరాలపై ఎంపీ దగ్గుబాటి కీలక ఆదేశాలు

image

గోదావరి పుష్కరాల దృష్ట్యా ఎన్‌హెచ్–365బీబీ అప్‌గ్రేడేషన్ పనులను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని రాజమండ్రి ఎంపీ డాక్టర్ దగ్గుబాటి పురందీశ్వరి ఆదేశించారు. బుధవారం తూర్పు గోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో రాజమండ్రి కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం జరిగింది. ప్రాజెక్ట్ పురోగతి, భూ సేకరణ, క్లియరెన్సులు, నిర్మాణ సంస్థల పనితీరుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

News November 26, 2025

రాజమండ్రి రూరల్: దేశభక్తిని చాటిన విద్యార్థులు

image

రాజమండ్రి రూరల్ బొమ్మూరులోని కలెక్టరేట్‌లో బుధవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని, భారత స్వాతంత్ర్య పోరాట స్పూర్తిని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శనలు సాగాయి. సంప్రదాయ భారతీయ కళ, సాహిత్య సోయగాలు ప్రతిఫలించిన ఈ కార్యక్రమాలు దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేశాయి.