News December 25, 2024
వైసీపీ తటస్థంగా ఉంటుంది: విజయసాయిరెడ్డి

రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి అన్నారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. తాము ఎన్డీఏ లేదా ఇండియా కూటమి పక్షం కాదని స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీ అయిన వైసీపీ తటస్థంగా ఉంటుందన్నారు. 2027లో జమిలి ఎన్నికలకు పార్లమెంట్లో బిల్లు పెడతారని తాను ముందే చెప్పినట్లు తెలిపారు. దీనిపై వేసిన జెపీసీలో తాను సభ్యుడిగా ఉన్నానన్నారు.
Similar News
News November 18, 2025
కంచరపాలెంలో 21న జాబ్ మేళా

కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయం NCSCలో ఈనెల 21న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉప ఉపాధి కల్పనాధికారి శ్యామ్ సుందర్ తెలిపారు. 200 పోస్టులకు మేళా చేపడుతుననట్లు ఆయన చెప్పారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 18-35 ఏళ్ల వయసున్న వారు అర్హులుగా పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు విశాఖ, విజయవాడ, హైదరాబాద్, చెన్నైలో పనిచేయాల్సి ఉంది.
News November 18, 2025
కంచరపాలెంలో 21న జాబ్ మేళా

కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయం NCSCలో ఈనెల 21న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉప ఉపాధి కల్పనాధికారి శ్యామ్ సుందర్ తెలిపారు. 200 పోస్టులకు మేళా చేపడుతుననట్లు ఆయన చెప్పారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 18-35 ఏళ్ల వయసున్న వారు అర్హులుగా పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు విశాఖ, విజయవాడ, హైదరాబాద్, చెన్నైలో పనిచేయాల్సి ఉంది.
News November 18, 2025
కార్గో రవాణాలో వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు

వస్తు రవాణాలో మరో మైలురాయిని నమోదు చేస్తూ వాల్తేరు రైల్వే డివిజన్ దేశవ్యాప్తంగా 5వ స్థానంలో నిలిచింది. 230 రోజుల్లో 50M టన్నుల సరకు రవాణాతో డివిజన్ చరిత్రలోనే అత్యున్నత రికార్డు సాధించింది. గత ఏడాదితో పోలిస్తే 12.5% పెరుగుదల నమోదైందని రైల్వే శాఖ ప్రకటించింది. స్టీల్ప్లాంట్, HPCL, విశాఖ పోర్ట్, గంగవరం పోర్ట్ వంటి కీలక లోడింగ్ పాయింట్లలో సదుపాయాల విస్తరణ, కార్యకలాపాల వేగవంతమే కారణమని తెలిపింది.


