News December 25, 2024
వైసీపీ తటస్థంగా ఉంటుంది: విజయసాయిరెడ్డి

రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి అన్నారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. తాము ఎన్డీఏ లేదా ఇండియా కూటమి పక్షం కాదని స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీ అయిన వైసీపీ తటస్థంగా ఉంటుందన్నారు. 2027లో జమిలి ఎన్నికలకు పార్లమెంట్లో బిల్లు పెడతారని తాను ముందే చెప్పినట్లు తెలిపారు. దీనిపై వేసిన జెపీసీలో తాను సభ్యుడిగా ఉన్నానన్నారు.
Similar News
News October 25, 2025
నాగుల చవితి సందర్భంగా VMRDA పార్కుల్లో ఉచిత ప్రవేశం

నాగుల చవితి పండగ సందర్భంగా నగరవాసుల సౌకర్యార్థం శనివారం VMRDA పరిధిలోని అన్ని పార్కుల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ ప్రకటించారు. నాగుల చవితి పురస్కరించుకుని ప్రజలు పుట్టల్లో పాలు పోసేందుకు కుటుంబసభ్యులతో పెద్ద సంఖ్యలో వస్తారన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. బీచ్ రోడ్ పార్క్, సెంట్రల్ పార్క్, కైలాసగిరి, తెన్నేటి పార్క్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు.
News October 24, 2025
విశాఖ: రోజ్గార్ మేళాలో యువతకు నియామక పత్రాల అందజేత

ఉడా చిల్డ్రన్ ఏరియాలో శుక్రవారం రోజ్గార్ మేళా నిర్వహించారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, మేయర్ పీలా శ్రీనివాస్ పాల్గొని నూతనంగా ఉద్యోగాలు సాధించిన 100 మంది యువతకు ప్రభుత్వ శాఖలలో నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో 51వేల మందికి పైగా యువతకు నియామక పత్రాలు ఈరోజు అందజేసినట్లు తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.
News October 24, 2025
ప్రోపర్టీ రికవరీ మేళా నిర్వహించిన విశాఖ సీపీ

విశాఖ సీపీ కార్యాలయంలో శుక్రవారం విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి సెప్టెంబర్ నెలకు సంబంధించి ప్రోపర్టీ రికవరీ మేళాను నిర్వహించారు. సెప్టెంబర్ నెలలో 56 కేసుల్లో 64మందిని పట్టుకున్నట్లు తెలిపారు. వారి నుంచి 766.35 గ్రాముల బంగారం, 699.6 గ్రాముల వెండి, 436 మొబైల్ ఫోన్స్, రూ.1,95,800 నగదు, 12 బైక్స్ రికవరీ చేసుకొని బాధితులకు అందజేశారు. మొత్తం రూ.1,10,10,050 సొత్తు రికవరీ చేసినట్లు సీపీ వెల్లడించారు.


