News June 26, 2024
వైసీపీ నేత హత్య కేసు సీఐడీకి అప్పగింత.!

సంచలనం రేపిన వైసీపీ నేత హత్య కేసు సీఐడీకి అప్పగించారు. గత ఏడాది జూన్ 23న కడపలో వైసీపీ నేత శ్రీనివాస్రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. శ్రీనివాసరెడ్డిని వైసీపీ కార్యకర్తలే చంపారని, ఈ హత్యకు సెటిల్మెంట్లు, భూదందాలు కారణమని ఆరోపణలు వచ్చాయి. హత్యకు కుట్ర పన్నిన వారిని పోలీసులే తప్పించారని హతుడి భార్య ఆరోపించారు. శ్రీనివాస్ రెడ్డి భార్య అప్పట్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు.
Similar News
News October 18, 2025
కడప: దీపావళి పండగకు 33 ప్రత్యేక బస్సులు

దీపావళి పండగ సందర్భంగా కడప జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో 33 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ గోపాల్ రెడ్డి తెలిపారు. బెంగళూరు – చెన్నై, హైదరాబాదు – విజయవాడకు నడుస్తాయన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News October 18, 2025
ఒంటిమిట్టకు తిరుమల లడ్డూలు

ఒంటిమిట్ట రామాలయానికి వచ్చే భక్తులకు 600 తిరుమల లడ్డూలు శనివారం అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారి నవీన్ తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక్కోటి రూ.50గా విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ప్రసాదాలు పొందవచ్చన్నారు.
News October 18, 2025
అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు చేయరాదు: ఎస్పీ

పోలీసుల అనుమతి లేకుండా కడప జిల్లా వ్యాప్తంగా ఇళ్లల్లో బాణాసంచా నిలువలు కానీ బాణసంచా నిల్వలు, విక్రయాలు చేయరాదని ఎస్పీ నచికేత్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే టపాసుల విక్రయాలు చేయాలని, అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.