News July 18, 2024
వైసీపీ పాలనలో భారీగా భూ ఆక్రమణలు: యార్లగడ్డ

ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా 1.75 లక్షల ఎకరాల భూ ఆక్రమణకు పాల్పడ్డారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఆక్రమించిన భూముల విలువ రూ.35,576 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో పదివేల ఎకరాలు, ఉచిత ఇసుక పేరుతో రూ.9,750 కోట్ల దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు.
Similar News
News October 23, 2025
ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో కొన్నిచోట్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి అలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ బాలాజీ ఆదేశించారు. ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద తగిన గోదాములు, తూకం యంత్రాలు, తడి ధాన్యం ఆరబెట్టే వసతులు, రైతులకు తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News October 23, 2025
కృష్ణా: రెవెన్యూ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష

మచిలీపట్నంలోని కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారులతో కలెక్టర్ బాలాజీ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తహశీల్దార్లు, మండల పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. తహశీల్దార్లు, వీఆర్వోలు సర్వేయర్లతో కలిసి జిల్లాలో ఉన్న లేఔట్లను క్షేత్రస్థాయిలో సందర్శించి, ఖాళీ స్థలాలను గుర్తించాలన్నారు.
News October 23, 2025
ఉయ్యూరు: అత్యాచార నిందితుడిని రోడ్డుపై నడిపించిన పోలీసులు

ఉయ్యూరులో రెండు రోజుల క్రితం బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు చాంద్ బాషాను పోలీసులు గురువారం నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు తీసుకెళ్లారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచే నిమిత్తం ఉయ్యూరు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు పోలీసులు సంకెళ్లతో నడిపించుకుంటూ తీసుకెళ్లారు. నిందితుడిని రోడ్డుపై తీసుకెళ్తుంటే జనాలు బారులు తీరి, చిన్నారికి న్యాయం జరిగేలా చూడాలని ప్రార్థించారు.