News September 26, 2024
వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా సురేశ్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పలు జిల్లాలకు పూర్తి అధ్యక్షులు, పార్టీ కన్వీనర్లను గురువారం ప్రకటించారు. మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేశ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News November 20, 2025
ప్రొద్దుటూరు: మొబైల్ చూస్తూ డ్రైవింగ్.. మరణానికి నాంది!

మొబైల్ చూస్తూ డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, అలాగే మృత్యువుకు దారి వేసినట్లేనని ప్రకాశం పోలీస్ బుధవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రకాశం పోలీసులు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించారు. ద్విచక్ర వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయరాదని, అటువంటి వారికి రూ.2 వేల జరిమానా లేక ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు.
News November 20, 2025
మందుబాబులకు.. ప్రకాశం పోలీస్ డిఫరెంట్ కౌన్సిలింగ్!

టంగుటూరు లోని రాగయ్య కుంట వద్ద మద్యం తాగుతూ చెత్తాచెదారం పోగుచేసిన పలువురికి పోలీసులు భిన్న రీతిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. పలువురు రాగయ్య కుంట వద్ద మద్యం తాగుతుండగా ఎస్సై నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గతంలో ఇదే ప్రదేశాన్ని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు క్లీన్ చేశారు. మందుబాబులు అదే ప్రదేశంలో చెత్త వేయడంతో వారి చేతనే పోలీసులు క్లీన్ చేయించారు.
News November 20, 2025
మందుబాబులకు.. ప్రకాశం పోలీస్ డిఫరెంట్ కౌన్సిలింగ్!

టంగుటూరు లోని రాగయ్య కుంట వద్ద మద్యం తాగుతూ చెత్తాచెదారం పోగుచేసిన పలువురికి పోలీసులు భిన్న రీతిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. పలువురు రాగయ్య కుంట వద్ద మద్యం తాగుతుండగా ఎస్సై నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గతంలో ఇదే ప్రదేశాన్ని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు క్లీన్ చేశారు. మందుబాబులు అదే ప్రదేశంలో చెత్త వేయడంతో వారి చేతనే పోలీసులు క్లీన్ చేయించారు.


