News February 4, 2025

వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం: బాలకృష్ణ

image

వైసీపీ హయాంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, అభివృద్ధి అంటే ఏమిటో కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తుందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. ఇప్పటికే హిందూపురం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలను సిద్ధం చేయడం జరిగిందన్నారు. వార్డులను అభివృద్ధి చేసుకోవాలని సంకల్పించి స్వచ్ఛందంగా వైసీపీకి రాజీనామా చేసి కౌన్సిలర్లు టీడీపీలో చేరారని అన్నారు.

Similar News

News November 20, 2025

రైల్వేలో 5,810 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

RRB 5,810 NTPC పోస్టుల దరఖాస్తు గడువును పొడిగించింది. నేటితో అప్లై గడువు ముగియగా.. ఈనెల 27వరకు పొడిగించింది. ఫీజు చెల్లించడానికి ఈ నెల 29 వరకు ఛాన్స్ ఇచ్చింది. డిగ్రీ అర్హతతో 18- 33ఏళ్లు గల వారు అప్లై చేసుకోవచ్చు. CBT, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News November 20, 2025

బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ టర్మ్స్

image

బిహార్ రాజకీయ భీష్ముడిగా పేరొందిన నితీశ్ ఇవాళ 10వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయన తొలిసారి 2000 సం.లో సీఎం అయ్యారు. అప్పటి నుంచి బీజేపీ, ఆర్జేడీ, కాంగ్రెస్, లోక్ జన్‌శక్తి.. ఇలా ఎన్నో పార్టీలతో కలిసి సీఎం పీఠాన్ని అధిరోహించారు.
*2000 మార్చి 3- 2000 మార్చి 7 *2005-2010
*2010-2014 *2015 FEB 22- 2015 NOV 19 *2015-2017 *2017-2020 *2020-2022 *2022-24 *2024-2025 NOV.

News November 20, 2025

నెలాఖరులోగా ఎయిర్‌పోర్టు భూసేకరణ పూర్తి!

image

మామునూర్ ఎయిర్‌పోర్టు భూసేకరణ కొలిక్కి వస్తోంది. భూసేకరణలో 330 మంది భూమిని కోల్పోగా, వారిలో 180మంది రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.120 కోట్లు జమయ్యాయి. మరో 80 మందికి త్వరలోనే రూ.60 కోట్లు పడనున్నాయి. ఈ నెలాఖరు వరకు భూసేకరణ పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. 220 ఎకరాలను సేకరించగా, వాటిలో 20ఎకరాల బాధితులు కోర్టును ఆశ్రయించారు. 330 మందికి మొత్తం రూ.295కోట్లను ప్రభుత్వం పరిహారం అందించనుంది.