News February 4, 2025
వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం: బాలకృష్ణ

వైసీపీ హయాంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, అభివృద్ధి అంటే ఏమిటో కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తుందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. ఇప్పటికే హిందూపురం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలను సిద్ధం చేయడం జరిగిందన్నారు. వార్డులను అభివృద్ధి చేసుకోవాలని సంకల్పించి స్వచ్ఛందంగా వైసీపీకి రాజీనామా చేసి కౌన్సిలర్లు టీడీపీలో చేరారని అన్నారు.
Similar News
News November 18, 2025
పొగ మంచుతో వాహనదారులు జాగ్రత్త: ఎస్పీ కాంతిలాల్ పాటిల్

పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ఏఎస్ఎఫ్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. సరిగా కనపడక పోవడం వలన ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడపాలని కోరారు. వాహన హెడ్లైట్లను తక్కువ దూరంలో ఉండేలా పెట్టుకోవాలని, వేగాన్ని తగ్గించాలని సూచించారు. ఎదురుగా వచ్చే వాహనాల శబ్దాన్ని విని జాగ్రత్తగా డ్రైవ్ చేయాలన్నారు.
News November 18, 2025
పొగ మంచుతో వాహనదారులు జాగ్రత్త: ఎస్పీ కాంతిలాల్ పాటిల్

పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని ఏఎస్ఎఫ్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. సరిగా కనపడక పోవడం వలన ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడపాలని కోరారు. వాహన హెడ్లైట్లను తక్కువ దూరంలో ఉండేలా పెట్టుకోవాలని, వేగాన్ని తగ్గించాలని సూచించారు. ఎదురుగా వచ్చే వాహనాల శబ్దాన్ని విని జాగ్రత్తగా డ్రైవ్ చేయాలన్నారు.
News November 18, 2025
‘వారణాసి’ ఈవెంట్ కోసం రూ.30 కోట్లు?

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ టైటిల్ రివీల్ ఈవెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ.30 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. 130 అడుగుల ఎత్తైన LED స్క్రీన్, సీటింగ్, ఇతరత్రాలకు భారీగానే వెచ్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీడియో రిలీజ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో <<18300800>>రాజమౌళి<<>> ఆవేదనలో మాట్లాడినట్లు తెలుస్తోంది.


