News April 12, 2024

వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రమేశ్‌రెడ్డి

image

వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాయచోటి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేశ్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ మేరకు అధిష్ఠానం ఎంపిక చేస్తూ ప్రకటన విడుదల చేసింది. రాయచోటి తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నా రమేశ్‌రెడ్డి రెండు రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. దీంతో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News December 4, 2025

కడప జిల్లాలో రియల్ ఎస్టేట్ ఢమాల్.!

image

కడప జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గింది. జిల్లాలో 12 SROలు ఉన్నాయి. వీటి ద్వారా 2025-26లో రూ.411.74 కోట్లు టార్గెట్ కాగా.. నవంబరు నాటికి రూ.181.73 కోట్లు మాత్రమే వచ్చింది. బద్వేల్-9.48, జమ్మలమడుగు-10.37, కమలాపురం-8.60, ప్రొద్దుటూరు-40.47, మైదుకూరు-7.10, ముద్దనూరు-3.44, పులివెందుల-11.96, సిద్దవటం-2.45, వేంపల్లె-6.14, దువ్వూరు-2.55, కడప-79.13 కోట్లు వచ్చింది.

News December 4, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు..!

image

ప్రొద్దుటూరులో గురువారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12765.00
☛ బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11744.00
☛ వెండి 10గ్రాములు రేట్: రూ.1760.00

News December 4, 2025

కడప జిల్లాలో 21 మంది ఎస్ఐల బదిలీలు

image

కడప జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 21 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ గురువారం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయినవారు సంబంధిత స్టేషన్లలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు చోటుచేసుకున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.