News March 14, 2025

వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మల్లయ్య యాదవ్

image

వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శిగా మల్లయ్య యాదవ్ ఎంపికయ్యారు. గుత్తి మండలం బేతపల్లికి చెందిన వైసీపీ నేతలు సూర్యనారాయణ, ఈశ్వరయ్య, తదితరులు మల్లయ్య యాదవ్‌ను ఆయన నివాసంలో కలిశారు. ముందుగా మల్లయ్యను శాలువాతో సత్కరించి, పూలమాల వేసి సన్మానించారు. రైతుల సమస్యల పట్ల పోరాడుతానన్నారు. తనను ఎంపిక చేసినందుకు వైఎస్ జగన్, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News January 5, 2026

ఈ నెల 6, 7వ తేదీలలో ఇంటర్వ్యూలు

image

17 పారామెడికల్ కళాశాలల్లో 2025-26 అకాడమిక్ ఇయర్‌కు సంబంధించి GNM కోర్సులో అడ్మిషన్స్ కోసం గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసినట్లు DMHO దేవి తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 761 మంది విద్యార్థినులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. కన్వీనర్ కోటాలో 594 సీట్లకు మెరిట్ కమ్ రిజర్వేషన్ ప్రాతిపదికన ఈనెల 6, 7వ తేదీలలో DMHO కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి కౌన్సిలింగ్ నిర్వహించి భర్తీ చేస్తామని DMHO తెలిపారు.

News January 4, 2026

అనంతపురం జిల్లా కాంగ్రెస్ బాస్ ఈయనే..!

image

అనంతపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరోసారి వై. మధుసూదన్ రెడ్డికే అధిష్టానం అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తనపై మరోసారి నమ్మకం ఉంచిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని పేర్కొన్నారు. ఈ నియామకంపై ఉరవకొండ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

News January 4, 2026

అనంతపురం జిల్లా కాంగ్రెస్ బాస్ ఈయనే..!

image

అనంతపురం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరోసారి వై. మధుసూదన్ రెడ్డికే అధిష్టానం అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తనపై మరోసారి నమ్మకం ఉంచిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని పేర్కొన్నారు. ఈ నియామకంపై ఉరవకొండ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.