News April 29, 2024

వైసీపీ స్టార్ క్యాంపెయినర్లుగా నియామకం

image

వైసీపీ స్టార్ క్యాంపెయినర్లుగా పార్టీ నియమించిన 37 మందిలో ఉత్తరాంధ్ర వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, అనకాపల్లి జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు, అల్లూరి జిల్లాకు చెందిన కె.భాగ్యలక్ష్మి ఉన్నారు. వీరు రాష్ట్రమంతా పర్యటిస్తూ రాజకీయ సభలో ప్రసంగిస్తారు. ఈ మేరకు అనుమతి మంజూరు చేయాలని కోరుతూ వైసిపి అధిష్టానం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు విజ్ఞప్తి చేసింది.

Similar News

News January 10, 2026

విశాఖ రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేసిన డీఆర్ఎం

image

విశాఖ రైల్వే స్టేషన్లో వాల్తేర్ డీఆర్ఎం లలిత్ బోహ్ర శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులు సౌలభ్యం కోసం అదనపు టికెట్ కౌంటర్లు, టికెట్ వెండింగ్ మిషన్లు, తాగునీరును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు డోర్ వద్ద నిలుచుని ప్రయాణం చేయకూడదని సూచించారు. ప్లాట్ ఫారం అవతల నుంచి రైలు ఎక్కడం వంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని ఆర్పీఎఫ్ పోలీసులను ఆదేశించారు.

News January 10, 2026

కేంద్రమంత్రి సురేష్ గోపికి స్వాగతం పలికిన జీవీఎల్

image

కేంద్రమంత్రి, సినీ నటుడు సురేష్ గోపి శనివారం విశాఖ చేరుకున్నారు. ఈయనకు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు స్వాగతం పలికారు. కేంద్రమంత్రి బీచ్ రోడ్డులోని లైట్ హౌస్ ఫెస్టివల్‌లో, అనంతరం ఏయూ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ‘ఆత్మనిర్భర్ భారత్ మహా సంక్రాంతి’ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో పెట్రోలియం, పర్యాటక రంగాలపై ఆయన సమీక్షలు నిర్వహించనున్నారు.

News January 10, 2026

విశాఖ జూ పార్క్‌లో స్వాన్, ఈము పిల్లల పునరుత్పత్తి

image

విశాఖ జూ పార్కులో కొన్ని వారాలుగా స్వాన్, ఈము గుడ్లను కృత్రిమంగా ఇంక్యూబేటర్‌లో పెట్టారు. శనివారం ఈ గుడ్ల నుంచి 6 ఈము పిల్లలు, ఒక బ్లాక్ స్వాన్ పిల్ల వచ్చినట్లు క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. అంతేకాకుండా రెండు సాంబార్ జింకలు, రెండు నీలిగాయి, మూడు బ్లాక్ బక్స్ కూడా జన్మించినట్లు చెప్పారు. విశాఖ జూ పార్కులో వన్యప్రాణుల పరిరక్షణకు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.