News April 29, 2024

వైసీపీ స్టార్ క్యాంపెయినర్లుగా నియామకం

image

వైసీపీ స్టార్ క్యాంపెయినర్లుగా పార్టీ నియమించిన 37 మందిలో ఉత్తరాంధ్ర వైసిపి రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, అనకాపల్లి జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు, అల్లూరి జిల్లాకు చెందిన కె.భాగ్యలక్ష్మి ఉన్నారు. వీరు రాష్ట్రమంతా పర్యటిస్తూ రాజకీయ సభలో ప్రసంగిస్తారు. ఈ మేరకు అనుమతి మంజూరు చేయాలని కోరుతూ వైసిపి అధిష్టానం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు విజ్ఞప్తి చేసింది.

Similar News

News November 21, 2025

ఉద్దానం కిడ్నీ వ్యాధులపై పరిశోధన ప్రారంభం

image

శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో కిడ్నీ వ్యాధులపై సమగ్ర అధ్యయనం ప్రారంభించామని కిడ్నీ వ్యాధుల పరిశోధన ప్రాజెక్టు మెంటర్ డా.టి.రవిరాజు అన్నారు. ఉద్దానం ప్రాంతంలో 18% జనాభా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.6.01కోట్లు ఖర్చు అవుతుందని అంచానా వేశారు. ఇచ్చాపురం, కంచిలి, పలాస, కవిటి, మందస, వజ్రపు కొత్తరు ప్రాంతాల్లో పరిశోధన చేస్తున్నామన్నారు.

News November 21, 2025

విశాఖ: ‘దళారులకు గంటా వార్నింగ్’

image

తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ భూములకు శనివారం నుంచి పరిహారం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఎకరాకు రూ.20 లక్షలు, 20 సెంట్ల భూమి ఇస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ ధర ఇప్పిస్తామని రైతులను మోసం చేస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. న్యాయమైన రైతుల కోరికలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

News November 21, 2025

నేడు గ్రేటర్‌ విశాఖ కౌన్సిల్ సమావేశం

image

జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం శుక్రవారం జరగనుండగా ఈ సమావేశంలో చర్చించేందుకు మొత్తం 90 అంశాలతో అజెండాను సిద్ధం చేశారు. వీటిలో ప్రధానంగా నగరంలోని వివిధ వార్డుల అభివృద్ధి పనులు, రోడ్లు, డ్రైనేజీ, వాటర్‌సప్లై వంటి మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. ముందస్తు వ్యూహరచనలో భాగంగా వైసీపీ తరఫున షాడో సమావేశాన్ని ఇప్పటికే నిర్వహించారు. సమావేశం ఉత్కంఠభరితంగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.