News March 19, 2025

వైసీపీ హయాంలో అక్రమాలపై విచారణ చేస్తాం: అచ్చెన్న

image

అవినీతి కోసమే పథకం అన్నట్లు గత వైసీపీ ప్రభుత్వ పాలన నడిచిందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలో ఆయన వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వాహనాల కొనగోళ్లు, నిర్వహణలో తప్పులు జరిగాయని తెలిపారు. వీటిలో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తామని చెప్పారు. పూర్తి స్థాయి నివేదిక రాగానే కఠిన చర్యలు ఉంటాని పేర్కొన్నారు. నివేదిక సంతృప్తిగా లేకుంటే మరో ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తామని చెప్పుకొచ్చారు.

Similar News

News March 19, 2025

వంజంగి అమ్మాయికి గేట్‌లో 25వ ర్యాంక్

image

ఆమదాలవలస మండలం వంజంగి గ్రామానికి చెందిన పైడి పూజిత నేడు విడుదలైన గేట్-2025 ఫలితాలలో ఆల్ ఇండియా 25 ర్యాంకు సాధించారు. పూజిత నాగపూర్‌లోని వీఎన్ఐటీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. పూజిత తండ్రి పైడి శ్రీనివాసరావు ఎల్.ఎన్.పేట ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. పూజిత తల్లి ఆదిలక్ష్మి గృహిణి. గేట్‌లో వంద మార్కులకు గాను 73 మార్కులు సాధించినట్లు తండ్రి శ్రీనివాస రావు తెలిపారు.

News March 19, 2025

శ్రీకాకుళం పది పరీక్షలకు 129 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. బుధవారం పది పరీక్షలకు హాజరైన విద్యార్థుల వివరాలను DEO తిరుమల చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 28,020 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 27,891 మంది హాజరైనట్లు వెల్లడించారు. 129 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మాల్ ప్రాక్టీస్ ఎక్కడా జరగలేదన్నారు. ప్రయివేటు విద్యార్థులు 14 మంది గైర్హాజరయ్యారన్నారు.

News March 19, 2025

కవిటిలో యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

సొంత మేనమామ పదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. కవిటి మండలంలోని రాజపురం పంచాయతీ తొత్తిపుట్టుగలో మార్చి11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్యాయంగా చూడాలస్సిన మేనమామ మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి తాళ్లతో కట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నొప్పి భరించలేక బాలిక కేకలు పెట్టడంతో భయపడి పారిపోయాడు. ఈ ఘటనపై డీఎస్పీ వెంకట అప్పరావు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!