News February 19, 2025

వైస్ ఛాన్స్‌లర్లుగా ఏయూ ఆచార్యులు 

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు నూతన ఉప కులపతులుగా నియమితులయ్యారు. ఆంధ్ర యూనివర్సిటీ ఆంగ్ల విభాగ సీనియర్ ఆచార్యులు ఏ.ప్రసన్నశ్రీ రాజమండ్రిలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అదేవిధంగా ఏయూలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగ ఆచార్యులు కె.రాంజీ మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా నియమింపబడ్డారు.

Similar News

News November 15, 2025

విశాఖ-హైదరాబాద్ రూ.18వేలు

image

విశాఖలో జరుగుతున్న CII సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలు, డెలిగేట్స్ భారీగా తరలివచ్చారు. శుక్రవారం సదస్సు ప్రారంభం కాగా.. ముందురోజే నగరానికి చేరుకున్నారు. దీంతో గురువారం నుంచి రెగ్యులర్‌ సర్వీసులతో పాటు అదనంగా మరికొన్ని విమానాలను నడిపినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. నేటితో సమ్మిట్‌ ముగియనుండడంతో హైదరాబాద్ నుంచి విశాఖకు టికెట్ రూ.4,000 – 5,000 వరకు ఉండగా.. విశాఖ-హైదరాబాద్ రూ.18వేల వరకు ఉంది.

News November 14, 2025

అయోధ్య తరహాలో సింహాచలం డిజైన్ లైటింగ్: గంటా

image

అయోధ్య తరహాలో సింహాచలానికి డిజైన్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని భీమిలి MLA గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సింహాచలంలో ఆయన పర్యటించారు. BRTS రోడ్డులో రూ.1.37 కోట్లు వ్యయంతో సెంట్రల్ లైటింగ్ ప్రారంభించారు. అడవివరం-పాతగోశాల వరకు లైటింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. దేవస్థానానికి రెగ్యులర్ ఈఓ లేకపోవడంతో సమస్యలు పెరిగాయని, త్వరలో నియామకం జరగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

News November 14, 2025

ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు ఆత్మీయ వీడ్కోలు

image

ఏయూ వేదికగా నిర్వహించిన సిఐఐ సమ్మెట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు శుక్రవారం ఆత్మీయ వీడ్కోలు లభించింది. శుక్రవారం ఉదయం చేరుకున్న ఆయనకు పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఆయన వాయుమార్గంలో ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు మంత్రులు, అధికారులు ఆయనకు వీడ్కోలు పలికారు.