News March 19, 2025
వై.రామవరం: పూడ్చిపెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం

వై.రామవరం మండలం పెద్దఊలెంపాడులో మంగళవారం పూడ్చిపెట్టిన బాలుడి మృతదేహానికి ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరిగింది. ఈ నెల8న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో పెద్దఊలెంపాడుకు చెందిన జాస్విక్ రెడ్డి(3) మృతి చెందాడు. 9న మృతదేహాన్ని ఖననం చేశారు. గ్రామస్థుల సూచనతో బాలుడి తల్లి మార్చి 17వతేదీ రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.
Similar News
News September 18, 2025
KNR: నేటి నుంచి సదరం క్యాంపులు

కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆధ్వర్యంలో నేటి నుంచి 24వ తేదీ వరకు సదరం క్యాంపులు జరగనున్నాయని జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దివ్యాంగులు మీసేవ కేంద్రాల ద్వారా తమ పేరును నమోదు చేసుకొని, కేటాయించిన తేదీల్లో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో హాజరుకావాలని కోరారు. మొత్తం 676 మందికి ఈ క్యాంపుల్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.
News September 18, 2025
సాహిత్య పురస్కారాలకు ముగ్గురు కవులు ఎంపిక

ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు కవులు సాహిత్య పురస్కారాలకు ఎంపిక య్యారు. NKP మండలానికి చెందిన సాగి కమలాకరశర్మ ఇటీవల దివాకర్ల వేంకటావధాని సాహిత్య పురస్కారానికి ఎంపిక కాగా.. నల్గొండకు చెందిన ఎస్. రఘు, సూర్యాపేట జిల్లా అనంతారం గ్రామానికి చెందిన బైరెడ్డి కృష్ణారెడ్డి తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరి ఎంపిక పట్ల సాహిత్యకారులు హర్షం వ్యక్తం చేశారు.
News September 18, 2025
MDK: మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

మెదక్లోని గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్ల కోసం ఈనెల 18, 19న దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఉమాదేవి తెలిపారు. కళాశాలలో బీఎస్సీ, బీఏ గ్రూప్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఎస్టీ విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివరాలకు 7901097706ను సంప్రదించాలని సూచించారు.