News March 19, 2025

వై.రామవరం: పూడ్చిపెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం

image

వై.రామవరం మండలం పెద్దఊలెంపాడులో మంగళవారం పూడ్చిపెట్టిన బాలుడి మృతదేహానికి ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరిగింది. ఈ నెల8న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో పెద్దఊలెంపాడుకు చెందిన జాస్విక్ రెడ్డి(3) మృతి చెందాడు. 9న మృతదేహాన్ని ఖననం చేశారు. గ్రామస్థుల సూచనతో బాలుడి తల్లి మార్చి 17వతేదీ రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

Similar News

News March 19, 2025

సైదాపూర్: పుట్టెడు దుఃఖంలో ఇంటర్ పరీక్ష రాసిన విద్యార్థి

image

సైదాపూర్ మండలం ఆరెపల్లి గ్రామనికి చెందిన బూర్గుల అభిరామ్ పుట్టెడు దు:ఖంలోనూ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాశాడు. అభిరామ్ తండ్రి రాజేశ్వర్‌రావు మృతిచెందగా తండ్రి మృతదేహం ఇంటిదగ్గర ఉండగానే పరీక్ష రాసొచ్చి అనంతరం తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి చితికి అభిరామ్ నిప్పంటించాడు. విద్యార్థిని బంధువులు, గ్రామస్థులు ఆవేదన చెందారు.

News March 19, 2025

కొడంగల్: బాలికపై అత్యాచారం.. నిందితుడి రిమాండ్

image

యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సైదులు, ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం బల్లునాయక్ తండా వాసి ధనావత్ పవన్ కుమార్(23) NRPT జిల్లా కొడంగల్ పరిధి మద్దూర్ మండలానికి చెందిన 17ఏళ్ల బాలికను ఇన్‌స్టాలో పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో మోసగించి, ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదవగా ఈరోజు జడ్జి 14 రోజులు రిమాండ్‌ విధించారు.

News March 19, 2025

6 గ్యారంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్: కిషన్ రెడ్డి

image

TG: 15 నెలలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, 420 వాగ్దానాల అమలును విస్మరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. 6 గ్యారంటీలపై ప్రజలు ఆశలు వదులుకొనేలా బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. అంకెల గారడీతో ప్రజలను మరోసారి మోసం చేశారన్నారు. పదేళ్ల పాటు BRS రాష్ట్రాన్ని అగాథంలోకి నెట్టేస్తే, కాంగ్రెస్ తీరు పెనంపై నుంచి పొయ్యిలోకి పడేసినట్లు చేసిందని ధ్వజమెత్తారు.

error: Content is protected !!