News April 15, 2025
వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై పోలీసుల దాడి

ఏలూరు రామచంద్రరావు పేటలోని సెయింట్ థెరీసా చిన్నపిల్లల గేటు సందులో ఓ గృహంలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో రెండో పట్టణ సీఐ అశోక్ కుమార్ తన సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి దాడి చేశారు. ఆ గృహంలో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకురాలని, నిర్వాహకుడిని అరెస్టు చేశారు. ఒక బాధితురాలని గుర్తించారు. ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. రెండు వేల నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News November 18, 2025
ఇన్ఛార్జ్ HM, పీడీలకు షోకాజ్ నోటీసులు: DEO

పిడుగురాళ్ల మండలం కరాలపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మట్టి పనులు చేయించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై డీఈవో చంద్రకళ స్పందించారు. పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం రాజు నాయక్, ఫిజికల్ డైరెక్టర్ అశోక్ కుమారిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై కమిటీ వేసి, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
News November 18, 2025
ఇన్ఛార్జ్ HM, పీడీలకు షోకాజ్ నోటీసులు: DEO

పిడుగురాళ్ల మండలం కరాలపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మట్టి పనులు చేయించినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై డీఈవో చంద్రకళ స్పందించారు. పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం రాజు నాయక్, ఫిజికల్ డైరెక్టర్ అశోక్ కుమారిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై కమిటీ వేసి, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
News November 18, 2025
మతిస్థిమితం లేని వ్యక్తుల వివరాలు అందించండి: VZM SP

జిల్లాలో రహదారులపై మతిస్థిమితం లేని నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ‘ఓ ఫౌండేషన్’ ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫౌండేషన్ వాల్ పోస్టర్ను ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను www.manobhandhu.org వెబ్సైట్కి పంపించాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సహకారంతో బాధితులను హోమ్లకు తరలించి చికిత్స అందించనున్నట్లు చెప్పారు.


