News June 24, 2024

వ్యవసాయ పనుల్లో నిమగ్నం

image

రుతు పవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆలస్యంగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ పనులు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే పొలాల దుక్కులు చదును చేసి విత్తనం నాటేందుకు సిద్ధంగా ఉన్న రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 1,18,286 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేయగా, నీటి వసతులు ఉన్న చోట్ల 8,512 ఎకరాల్లో వరి నాట్లు వేశారు.

Similar News

News February 21, 2026

ఖమ్మం: రైతులకు ALERT.. 27 వరకు విక్రయాలు

image

ఖమ్మం జిల్లాలో 2025-26 సీజన్‌కు సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) పత్తి కొనుగోలు గడువును ఫిబ్రవరి 27 వరకు పొడిగించినట్లు ఖమ్మం అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లుల్లో ఈ గడువు వరకు కొనుగోళ్లు జరుగుతాయి. రైతులు తమ పత్తిని ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకుని విక్రయించుకోవాలని అధికారులు సూచించారు.

News February 21, 2026

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపిక కోసం గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు మార్చి 25లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. స్టేట్/సెంట్రల్ బోర్డు గుర్తింపు, గత ఐదేళ్లలో 7వ, 10వ తరగతుల్లో 90% పైగా ఉత్తీర్ణత, మెరుగైన సదుపాయాలు ఉండాలని స్పష్టం చేశారు. దరఖాస్తులు డిప్యూటీ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

News February 21, 2026

ఖమ్మం: బాలకృష్ణ, లోకేశ్‌తో మంత్రి తుమ్మల భేటీ

image

హైదరాబాదులో జరిగిన ఒక వివాహ వేడుకలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కాసేపు కుశలప్రశ్నలు వేసుకుని, వివిధ అంశాలపై ముచ్చటించారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఒకే వేదికపై కలిసిన ఈ దృశ్యం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.