News April 11, 2025
శంకరపట్నం: రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మహిళ మృతి

శంకరపట్నం(M) తాడికల్ గ్రామశివారులో KNR-WGL ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సైదాపూర్ మండలం గర్రెపల్లికి చెందిన కౌడగాని కిషన్ రావు, భార్య శోభ, కూతురు అశ్విని బైక్పై వెళ్తుండగా కారు ఢీకొట్టింది. దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శోభ చికిత్స పొందుతూ మృతి చెందింది. శోభ తమ్ముడు సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు SI రవి తెలిపారు.
Similar News
News November 30, 2025
కరీంనగర్: 113 గ్రామాలకు 121 నామినేషన్లు

కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల మొదటి రోజు 113 గ్రామాలకు121 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. చిగురు మామిడి మండలంలో 16, గన్నేరువరం మండలంలో 10, మానకొండూర్ మండలంలో 30, శంకరపట్నం మండలంలో 35, తిమ్మాపూర్ మండలంలో 30 గ్రామ సర్పంచికి నామినేషన్లు దాఖలు అయ్యాయి.113 గ్రామాలలో 1046 వార్డు లు ఉండగా, మొదటి రోజు 209 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు.
News November 30, 2025
కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కరీంనగర్ రూరల్ మండలం నగునూరు శివారు చమనపల్లి రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొదట రెండు బైక్లు ఢీకొనగా అటుగా వస్తున్న లారీ వారిపై నుంచి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతులు చామనపల్లి, సాంబయ్యపల్లికి చెందిన వారిగా గుర్తించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News November 30, 2025
KNR: ‘ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్కు అప్లై చేసుకోండి’

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎస్టీ విద్యార్థులకు ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన అభివృద్ధి అధికారిణి కే.సంగీత తెలిపారు. 5 నుంచి 10వ తరగతి విద్యార్థులు డిసెంబర్ 31లోగా e-passలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సంబంధిత హెచ్ఎంలు రిజిస్ట్రేషన్ పత్రాలను అప్లోడ్ చేయాలని ఆమె సూచించారు.


