News April 11, 2025

శంకరపట్నం: సన్న బియ్యం పథకం విప్లవాత్మకం: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

image

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పథకం అమలు చేయడం విప్లవాత్మకమని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలో గురువారం సన్న బియ్యం లబ్దిదారుడు చలిగంటి గణేశ్ ఇంట్లో సన్న బియ్యంతో వండిన అన్నంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్ సహపంక్తి భోజనం చేశారు.

Similar News

News April 18, 2026

KNR: మైనారిటీ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు

image

జిల్లాలోని నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్వర్ తెలిపారు. ఆస్ట్రేలియా, ఓమన్, జర్మనీ, గ్రీసీ, ఖతార్ తదితర దేశాల్లో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయని, ఐటీఐ, డిగ్రీ, పీజీ, డిప్లోమా, నర్సింగ్ కోర్సులు చదివి 21 నుంచి 58 ఏళ్లలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 9440051285, 9440051452 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News April 18, 2026

KNR: పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో HYD దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళ పాలిటెక్నిక్ సంస్థలో 3 సంవత్సరాల 2026-27 డిప్లమో కోర్సులకు అనాధ బాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా శిశు సంక్షేమ అధికారి తెలిపారు. దీనికి పాలిటెక్ని ప్రవేశపరిక్ష రాయకున్నా టెన్త్ పాస్ అయి ఉండాలి. ఎంపికైన వారికి ఉచిత విద్య వసతి కల్పిస్తారు. మే 23లోగా KNR బాల రక్షభవన్లో దరఖాస్తు చేయాలి. వివరాలకు 9490881098 సంప్రదించవచ్చు.

News April 18, 2026

KNR: కంటతడి పెట్టించిన రోడ్డు ప్రమాద బాధితుల గాథలు

image

రోడ్డు ప్రమాదాలు మిగిల్చిన తీరని శోకం కరీంనగర్ సదస్సులో ప్రతిధ్వనించింది. ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమంలో ప్రమాద బాధితులు తమ ఆవేదనను పంచుకోగా, డీజీపీ శివధర్ రెడ్డితో సహా సభలోని సభ్యులు కంటతడి పెట్టారు. ఒకరి నిర్లక్ష్యం కుటుంబాలను ఎలా రోడ్డున పడేస్తుందో వివరిస్తూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ గాథలు వాహనదారుల బాధ్యతారాహిత్యానికి ‘చెంపపెట్టు’ కావాలని డీజీపీ పేర్కొన్నారు.