News January 27, 2025

శంబర జాతరకు వెళ్లే భక్తులకు అలెర్ట్

image

శంబర పోలమాంబ జాతర రద్దీ దృష్ట్యా ఆటోలు, ఫోర్ వీలర్ వాహనాలను కవిరిపల్లి మీదుగా శంబర అనుమతి లేదని మక్కువ ఎస్ఐ M. వెంకటరమణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ద్విచక్ర వాహనాలను మాత్రమే కవిరిపల్లి మీదుగా అనుమతించడం జరుగుతుందని అన్నారు. ఆటోలు, ఫోర్ వీలర్ వాహనాదారులు చెముడు మీదుగా శంబర చేరుకోవాలని ఆయన సూచించారు.

Similar News

News November 11, 2025

HYD: అందెశ్రీని KCR అవమానిస్తే సీఎం గౌరవించారు: చనగాని

image

ప్రముఖ కవి అందెశ్రీని మాజీ సీఎం కేసీఆర్ అవమానిస్తే సీఎం రేవంత్ రెడ్డి గౌరవించారని కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ అన్నారు. ‘ప్రజాపాలనలో సీఎం అందెశ్రీ పాటను గౌరవించి తెలంగాణ రాష్ట్ర గేయంగా మార్చారు. BRS హయాంలో ఉద్యమకారులకు గౌరవం దక్కలేదు. ప్రజా గాయకులు గద్దర్‌, అందెశ్రీని ప్రభుత్వం గౌరవించింది. సీఎం స్వయంగా అందెశ్రీ పాడె మోయడం అంటే ఆయన త్యాగాలను గౌరవించడమే’ అని అన్నారు.

News November 11, 2025

సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ జియో ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ(NIGST), సర్వే ఆఫ్ ఇండియాలో 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MBA, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఈ, PhD ఉత్తీర్ణతతో పాటు నెట్ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5 వరకు అప్లై చేసుకోవచ్చు. యంగ్ ప్రొఫెషనల్, రీసెర్చ్ అసోసియేట్, FRF పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://surveyofindia.gov.in

News November 11, 2025

యంగ్‌గా ఉండాలా.. ఎక్కువ భాషలు నేర్చుకో

image

వయసు పెరుగుతున్నా యంగ్‌గా కనిపించాలని అందరూ కోరుకుంటారు. ఒకే భాషలో మాట్లాడేవారితో పోలిస్తే 2 అంతకంటే ఎక్కువ భాషలు మాట్లాడేవారి మెదడు యవ్వనంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. 27 యూరోపియన్ దేశాలలో 51-90 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 80వేల మందిపై జరిపిన స్టడీలో ఇది వెల్లడైంది. ఒకే భాషలో మాట్లాడేవారి మెదడు 2 రెట్లు త్వరగా వృద్ధాప్య దశకు చేరుకుంటున్నట్టు స్పష్టమైంది. లేటెందుకు ఈరోజు నుంచే కొత్త భాష నేర్చుకోండి.