News January 27, 2025
శంబర జాతరకు వెళ్లే భక్తులకు అలెర్ట్

శంబర పోలమాంబ జాతర రద్దీ దృష్ట్యా ఆటోలు, ఫోర్ వీలర్ వాహనాలను కవిరిపల్లి మీదుగా శంబర అనుమతి లేదని మక్కువ ఎస్ఐ M. వెంకటరమణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ద్విచక్ర వాహనాలను మాత్రమే కవిరిపల్లి మీదుగా అనుమతించడం జరుగుతుందని అన్నారు. ఆటోలు, ఫోర్ వీలర్ వాహనాదారులు చెముడు మీదుగా శంబర చేరుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News February 28, 2026
ఏలూరు: ‘సెకండ్ ఇంటర్ పరీక్షకు 5,791 మంది హాజరు’

ఏలూరు జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్ సెంకడ్ ఇయర్బో టనీ పరీక్షకు మొత్తం 6,828 మంది విద్యార్థులకు గానూ 5,791 మంది హాజరయ్యారని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. 55 సెంటర్లో జరిగిన ఈ పరీక్షలకు వివిధ కారణాల చేత 237 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 3,916 మంది, ఒకేషనల్ విభాగంలో 1,875 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు ఆయన వివరించారు.
News February 28, 2026
MAR 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’: CM రేవంత్

TG: అభివృద్ధి ప్రణాళికల అమలుకు MAR 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ పేరిట 99days కార్యక్రమం నిర్వహించనున్నట్లు CM రేవంత్ తెలిపారు. ‘ప్రభుత్వ ఆఫీసులు ఇకపై అద్దె భవనాల్లో ఉండకూడదు. ఫైళ్ల క్లియరెన్స్ నిర్ధిష్ట సమయంలో జరగాలి. కంపెనీల ఒప్పందాలు, పెట్టుబడులు గ్రౌండ్ కావాలి. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. 100 నియోజకవర్గాల్లో TG పబ్లిక్ స్కూళ్లు ప్రారంభించాలి’ అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News February 28, 2026
ఏలూరు: ‘అసలు కట్టి.. వడ్డీ పట్టు’

ఉమ్మడి ప.గో వ్యాప్తంగా 465 మంది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం పొంది బకాయి ఉన్న అసలు రూ.13.55 కోట్లను చెల్లిస్తే వడ్డీ మాఫీ అవుతుందని ఈఈ ముక్కంటి శనివారం తెలిపారు. ఈ సొమ్ముకు వడ్డి రూ.1.66 కోట్లు ఉందన్నారు. ఏప్రిల్ 30 లోపు అసలు కడితే, వడ్డీ మాఫీ అవుతుందని స్పష్టం చేశారు. ద్వారకా తిరుమల (M) జీ.కొతపల్లి గ్రామానికి చెందిన జొన్నకూటి వెంకటేశ్వర రావు తీసుకున్న నగదు పూర్తిగా చెల్లించడంతో సత్కరించారు.


