News January 27, 2025
శంబర జాతరకు వెళ్లే భక్తులకు అలెర్ట్

శంబర పోలమాంబ జాతర రద్దీ దృష్ట్యా ఆటోలు, ఫోర్ వీలర్ వాహనాలను కవిరిపల్లి మీదుగా శంబర అనుమతి లేదని మక్కువ ఎస్ఐ M. వెంకటరమణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ద్విచక్ర వాహనాలను మాత్రమే కవిరిపల్లి మీదుగా అనుమతించడం జరుగుతుందని అన్నారు. ఆటోలు, ఫోర్ వీలర్ వాహనాదారులు చెముడు మీదుగా శంబర చేరుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News January 14, 2026
CEERIలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News January 14, 2026
వనపర్తి జిల్లా ప్రజలకు కలెక్టర్, ఎస్పీ శుభాకాంక్షలు

మకర సంక్రాంతిని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వనపర్తి జిల్లాలో పంటలు సమృద్ధిగా పండి, రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరారు.
News January 14, 2026
విమానాలకు ‘పొగ’బెట్టిన భోగి

చెన్నైలో భోగి పండుగ విమాన రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. పొగమంచుకు తోడు భోగి మంటలతో వచ్చిన పొగతో పూర్ విజిబిలిటీ ఏర్పడింది. దీంతో చెన్నై ఎయిర్పోర్టులో విమానాలు ల్యాండ్ కాలేకపోతున్నాయి. వాటిని డైవర్ట్ చేస్తున్నారు. అయితే సమయం గడిచేకొద్దీ విజిబిలిటీ పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా ప్రజలు ప్లాస్టిక్, రబ్బర్ టైర్లు కాల్చకుండా స్మోక్ ఫ్రీ సెలబ్రేషన్స్ చేసుకోవాలని TNPCB కోరింది.


