News December 25, 2024
శంషాబాద్లో ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దంపతులకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి మెదక్ జిల్లాలోని తునికిలోని ఐసీఏఆర్ విజ్ఞాన కేంద్రానికి షెడ్యూల్ ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లారు. విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ పంటలు పండిస్తున్న సుమారు 500 మంది రైతులతో ఉపరాష్ట్రపతి మాట్లాడుతారు.
Similar News
News January 20, 2025
HYD: AIR PORT రన్ వే కింద నుంచి ఎలివేటెడ్ కారిడార్!
ఎయిర్పోర్ట్ అథారిటీ పరిమితుల కారణంగా HMDA డబుల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని బేగంపేట అంతర్జాతీయ విమానాశ్రయ రన్ వే కింద నుంచి అండర్ గ్రౌండ్లో తాడ్ బండ్, బోయిన్పల్లి మధ్యలో దాదాపు 600 మీటర్ల మేర నిర్మించాలని నిర్ణయం తీసుకుందని హైదరాబాద్ మెట్రో ఎండీ NVS రెడ్డి తెలియజేశారు. కంటోన్మెంట్ ఏరియాలో విస్తృతంగా పర్యటించి, మార్గాలను పరిశీలించారు.
News January 20, 2025
GHMC ఆఫీస్లో ప్రజావాణి కార్యక్రమం
ఖైరతాబాద్లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను, వినతులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు పరిష్కరించాలని ఆదేశించారు. సకాలంలో సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులను డిప్యూటీ మేయర్ ఆదేశించారు.
News January 20, 2025
చర్లపల్లి: మరో 8 రైళ్లు నడిపేందుకు నిర్ణయం
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో పెరిగిన రైళ్ల ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి స్టేషన్ విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి టెర్మినల్ నుంచి మార్చిలో మరో 8 రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చర్లపల్లి టర్మినల్ నుంచి చెన్నై, గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడపడానికి పచ్చ జెండా ఊపింది.