News January 4, 2025

శంషాబాద్: కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు నమోదు

image

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని చేస్తున్న ఇద్దరు కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు నమోదైంది. ప్రయాణికుడి నుంచి రూ.50 వేలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం సదరు అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేసి రూ. 4.76 లక్షల స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ అధికారులు వినయ్ కుమార్, ముఖేశ్ కుమార్‌‌గా గుర్తించారు.

Similar News

News January 17, 2025

ఇబ్రహీంపట్నం: కూతురు వరసయ్యే బాలికపై అత్యాచారం

image

కూతురు వరసైన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆదిభట్ల PS పరిధిలో జరిగింది. పోలీసుల కథనం.. తుర్కయంజాల్‌కు చెందిన ఆంజనేయులుకు వరుసకు కూతురయ్యే బాలిక పుట్టినరోజు సందర్భంగా కొత్త బట్టలు కొనిస్తానని ఇంట్లో చెప్పి తుర్కయంజాల్‌లోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అనంతరం బాలిక కేకలు వేస్తూ బయటకు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు.

News January 17, 2025

HYD: జంట హత్యల కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు

image

నార్సింగి PSలో <<15169186>>జంట హత్య<<>>కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం.. సాకేత్‌కు బిందుతో పరిచయం ఏర్పడింది. అనంతరం సాకేత్ సాయంతో బిందు వ్యభిచారం మొదలుపెట్టింది. ఈ క్రమంలో అంకిత్ స్నేహితుడు రాహుల్ బిందుతో ఏకాంతంగా గడిపి వీడియో తీసేందుకు యత్నించాడు. ఆమె అడ్డు చెప్పి అక్కడి నుంచి వచ్చి సాకేత్‌కు చెప్పడంతో రాహుల్‌ను హెచ్చరించాడు. దీంతో రాహుల్ కక్ష పెంచుకుని మరో ఇద్దరితో కలిసి హతమార్చాడు.

News January 17, 2025

నేడు గుడిమల్కాపూర్‌ మర్కెట్ కమిటీ ప్రమాణం

image

గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఈరోజు జరుగనుంది. ఛైర్మన్‌గా మల్లేశ్, వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్ సభ్యులు ప్రమాణం చేయనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, తుమ్మల నాగేశ్వర్‌రావు తదితరులు హాజరుకానున్నారు.