News April 15, 2025

శంషాబాద్: విమానంలో ప్రాణాలు కాపాడిన డాక్టర్

image

విమానంలో అస్వస్థతకు గురైన ఓ వృద్ధుడిని డాక్టర్ కాపాడారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో వృద్ధుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే విమానంలో ప్రయాణిస్తున్న డా.ప్రీతిరెడ్డి ఇది గమనించారు. వెంటనే అతడికి CPR చేశారు. స్పృహలోకి రావడంతో గమ్యస్థానానికి చేర్చారు. డాక్టర్ ప్రీతిరెడ్డి చొరవ పట్ల ఇతర ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ డాక్టర్ ఎవరో కాదు మన మేడ్చల్ MLA మల్లారెడ్డి కోడలే.

Similar News

News November 28, 2025

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఫోరమ్‌కు 21 వినతులు

image

జీవీఎంసీలో శుక్రవారం నిర్వహించిన ‘టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్’కు 21 వినతులు వచ్చినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకారరావు తెలిపారు. సాధారణ స్పందనలో రద్దీ తగ్గించేందుకు ప్రతి శుక్రవారం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జోన్-3 నుంచి అత్యధికంగా 7 అర్జీలు రాగా.. స్వీకరించిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

News November 28, 2025

వంగూరు: సీఎం సొంత గ్రామ సర్పంచ్ స్థానం ఏకగ్రీవం..?

image

నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి (సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం) సర్పంచ్ స్థానం ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ, గ్రామ అభివృద్ధి కోసం ఏకగ్రీవం చేయాలనే ఉద్దేశంతో ఎవరూ నామినేషన్లు వేయడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో సర్పంచ్‌ స్థానం ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

News November 28, 2025

తిరుమల శ్రీవారి పుష్పాలను ఏం చేస్తారో తెలుసా?

image

తిరుమల శ్రీవారి సేవ కోసం రోజుకు కొన్ని వందల కిలోల పూలు వాడుతారు. మరి వాటిని ఏం చేస్తారో మీకు తెలుసా? పూజ తర్వాత వాటిని బయట పడేయరు. తిరుపతికి తరలిస్తారు. అక్కడ శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనంలోని పూల ప్రాసెసింగ్ యూనిట్‌కు పంపుతారు. ఈ యూనిట్‌లో ఈ పూల నుంచి పరిమళభరితమైన అగరబత్తులు, ఇతర సుగంధ ద్రవ్యాలను తయారుచేస్తారు. తద్వారా పూల పవిత్రతను కాపాడుతూనే, వాటిని ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మారుస్తారు.