News February 12, 2025
శంషాబాద్ విమానాశ్రయానికి 6 పుష్పక్ బస్సులు

శంషాబాద్ విమానాశ్రయానికి మరిన్ని పుష్పక్ సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఈడీ రాజశేఖర్ తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12:55 గం.కు మొదటి బస్సు, రాత్రి 11:55 గంటలకు ఆఖరి బస్సు ఉంటుందన్నారు. నేటి నుంచి విమానాశ్రయం మీదుగా 6 సర్వీసులు రాకపోకలు సాగిస్తాయన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12:50 గంటలకు మొదటి బస్సు, రాత్రి 11:50 గంటలకు చివరి బస్సు ఉంటుందన్నారు.
Similar News
News October 28, 2025
హరీశ్రావు తండ్రి మరణం బాధాకరం: ‘X’లో సీఎం

మాజీ మంత్రి, సిద్ధిపేట MLA హరీశ్రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి Xలో వేదికగా పోస్ట్ చేశారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్రావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని రాసుకొచ్చారు.
News October 28, 2025
HYD: 2 గంటలకుపైగా సోషల్ మీడియాలోనే

నేషనల్ వెబ్ ఇండెక్స్ సర్వే ప్రకారం నగర యువత రోజుకు 2 గంటలకుపైగా సోషల్ మీడియాలో గడిపేస్తున్నట్లు తేలింది. ఫ్యామిలీ పంచాయితీలు, వివరాలు అన్నీ ఇందులో పెట్టేస్తూ లేనిపోని వ్యవహారల్లో తలదూరుస్తున్నట్లు తేలింది. SMను సమాచారం కోసం కాకుండా వినోదం, కొత్త ఫ్రెండ్స్తో ఛాటింగ్కు ఓపెన్ చేస్తున్నట్లు తేలింది. దీంతో చదువు అటకెక్కుతుందని, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదని, SMపై నియంత్రణ అవసరమని సూచించారు.
News October 28, 2025
HYD: రాత్రి భారీ వర్షం.. పలుచోట్ల చిరుజల్లులు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్, నాచారం, తార్నాక, హబ్సిగూడ, శివంరోడ్ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. శివారు పెద్దఅంబర్పేట్, ఇబ్రహీంపట్నం, కందుకూరు తదితర ప్రాంతాల్లో రాత్రి 1 నుంచి ఉ.3వరకు భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లగా మారింది. రోడ్లపై నీరు నిలిచింది. ఆఫీసు సమయాల్లో ట్రాఫిక్ నెమ్మదించింది. ఈరోజు సాయంత్రం గ్రేటర్ వ్యాప్తంగా వర్షం కురిస్తుందని అధికారులు అంచనా వేశారు.


