News February 12, 2025
శంషాబాద్ విమానాశ్రయానికి 6 పుష్పక్ బస్సులు

శంషాబాద్ విమానాశ్రయానికి మరిన్ని పుష్పక్ సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఈడీ రాజశేఖర్ తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12:55 గం.కు మొదటి బస్సు, రాత్రి 11:55 గంటలకు ఆఖరి బస్సు ఉంటుందన్నారు. నేటి నుంచి విమానాశ్రయం మీదుగా 6 సర్వీసులు రాకపోకలు సాగిస్తాయన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12:50 గంటలకు మొదటి బస్సు, రాత్రి 11:50 గంటలకు చివరి బస్సు ఉంటుందన్నారు.
Similar News
News November 11, 2025
జూబ్లీబైపోల్: 9:30 గంటలకు Voter Turnout

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ సాఫీగా జరుగుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి RV కర్ణన్ తెలిపారు. పలుచోట్ల EVM యంత్రాలు మొరాయిస్తుండగా చర్యలు చేపట్టి, పునరుద్ధరించారు. ఫస్ట్ ఓటర్ టర్న్ అవుట్ ఉదయం 9:30 గంటలకు అందుబాటులో ఉంటుందని ECVT టీం తెలిపింది. దీని ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది ఓటు వేశారు? పర్సంటేజ్ ఎంత? అనే వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.
News November 11, 2025
HYD: ఓటు వేసి ఈ పని చేయండి

ఓటు వేయడం మన బాధ్యత.. మనం ఓటేస్తే ఇంకొకరు పోలింగ్ బూత్కు వెళతారు.. అందుకే మీరు ఓటు వేసిన తరువాత బయటకు వచ్చి ‘నేను ఓటు వేశా.. మరి మీరు..? అని క్యాప్షన్ పెట్టి మీ ఇన్స్టా, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియాల్లో పోస్ట్ చేయండి. దానిని చూసిన మరికొందరికి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఓటేస్తారు. ఇలా అందరూ చేస్తే పోలింగ్ శాతం పెరుగుతుంది..మంచి నాయకుడు గెలుస్తారు.
News November 11, 2025
జూబ్లీహిల్స్ బై పోల్: ఇది ఐడీ కార్డు కాదు.. లైఫ్ కార్డు

మీరు కొత్త ఓటరా.. ఈ మధ్యనే ఓటరుగా నమోదయ్యారా..! గుర్తుంది కదా.. నేడే పోలింగ్ డేట్. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమవుతుంది. ఓటరు కార్డు వచ్చింది కదా అని పర్సులో పెట్టి అలా వదిలేయకండి. ఓటు వేసి మీ నిర్ణయం చెప్పండి. అది కేవలం గుర్తింపు కార్డు కాదు.. మన జీవితాలను డిసైడ్ చేసే కార్డు. దానిని ఉపయోగించండి. పని చేయని నాయకులకు బుద్ధి చెప్పే యత్నం చేయండి.


