News March 8, 2025
శక్తి సామర్థ్యాలు పెంచేందుకు ఆన్లైన్ శిక్షణ: కలెక్టర్

ప్రభుత్వ ఉద్యోగుల శక్తి సామర్థ్యాలు పెంపొందించడానికి ప్రభుత్వం కర్మయోగి పోర్టల్ ద్వారా ఆన్లైన్ ట్రైనింగ్ నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ నెల 16 లోగా ఆన్లైన్ శిక్షణ పూర్తి చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల డీడీఓలు తమ పరిధిలోని ఉద్యోగులు అంతా మూడు అంశాలపై శిక్షణ పూర్తి చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News March 15, 2025
గ్రూప్-3లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికంటే?

TG: నిన్న వెలువడిన గ్రూప్-3 ఫలితాల్లో మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన అర్జున్ 339.239 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈయన గ్రూప్-2లో స్టేట్ 18వ ర్యాంక్ సాధించడం గమనార్హం. మొత్తం 2,67,921 మంది పరీక్షలు రాయగా 2,49,557 మందికి జనరల్ ర్యాంకింగ్ లిస్టులను రిలీజ్ చేశారు. టాప్-10లో ఒక్కరు మాత్రమే అమ్మాయి ఉండటం గమనార్హం. మొత్తంగా టాప్-100లో 12 మంది అమ్మాయిలు ఉన్నారు.
News March 15, 2025
సాలూరు : మున్సిపల్ కమిషనర్ సరెండర్

సాలూరు మున్సిపల్ కమిషనర్ విహెచ్ సత్యనారాయణను సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. గురువారం రాత్రి మన్యం జిల్లా కలెక్టర్ నిర్వహించిన జూమ్ మీటింగ్ కమిషనర్ పాల్గొనకపోవడం, మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం తదితర కారణాల వలన సరెండర్ చేసినట్లు తెలుస్తోంది.
News March 15, 2025
ఖమ్మం: భార్యతో గొడవ.. భర్తను అప్పగించిన పోలీసులు

భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లగా మధిర పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఖమ్మం 3టౌన్కు చెందిన D.శ్రీనివాసరావు గత రెండు రోజుల క్రితం తన భార్యతో గొడవపడి, ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. శుక్రవారం మధిరలో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందగా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి శ్రీనివాసరావును కుటుంబ సభ్యులకు అప్పగించారు.