News February 26, 2025

శతశాతం ఈ-పంట నమోదు చేయాలి: కలెక్టర్ 

image

జిల్లాలో శత శాతం ఈ-పంట నందు నమోదు చేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరు కార్యాలయ సమావేశం మందిరంలో వ్యవసాయశాఖకు సంబంధించి ఈ-పంట నమోదుపై మండలాల వారీగా మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 32వేల ఎకరాలకు సంబంధించి 84 శాతం నమోదు పూర్తయిందన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి శతశాతం పూర్తిచేయాలని సూచించారు.

Similar News

News October 17, 2025

పెద్దపల్లి కలెక్టరేట్‌లో సీపీఆర్‌పై అవగాహన

image

పెద్దపల్లి కలెక్టరేట్‌లో శుక్రవారం CPRపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. DMHO డా.వాణిశ్రీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో డా.ప్రశాంత్ (జనరల్ ఆసుపత్రి, రామగుండం) సీపీఆర్‌పై ప్రాక్టికల్ డెమో ఇచ్చారు. గుండెపోటు సమయంలో ప్రజల ప్రాణాలను సకాలంలో కాపాడవచ్చని అన్నారు. అందరూ సీపీఆర్ నైపుణ్యం నేర్చుకోవాలని డా.వాణిశ్రీ సూచించారు. జిల్లాలోని వైద్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News October 17, 2025

పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారంపై దృష్టి పెట్టండి: KMR SP

image

కామారెడ్డి SP రాజేష్ చంద్ర శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను నాణ్యమైన దర్యాప్తుతో త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రాపర్టీ నేరాల నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. రాత్రి సమయాల్లో అనవసరంగా తిరిగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలన్నారు.

News October 17, 2025

వెల్లంకిలో కలెక్టర్ ‘పల్లెనిద్ర’

image

రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామాభివృద్ధి, సమస్యలపై అధికారులతో సమీక్ష జరిపారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ భాస్కరరావు, ఇతర మండల అధికారులు పాల్గొన్నారు.