News August 30, 2024
శతాబ్ది ఉత్సవాలకు సిద్దమవుతున్న మెదక్ చర్చి

మెదక్ జిల్లాలో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద రెండవ దేవాలయంగా పేరొందని సీఎస్ఐ మెదక్ చర్చిలో వచ్చే నెల సెప్టెంబర్లో శతాబ్ది ఉత్సవాల నిర్వహణకు సిద్దమైంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న స్త్రీల మైత్రి ఉత్సవాలు చర్చి వార్షికోత్సవం పేరుతో ఉత్సవాలు నిర్వహించేవారు. గత 3 ఏళ్లుగా కరోనా కారణంగా చర్చి ఉత్సవాలు జరుగలేదు. ఈసారి పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపడానికి చర్చి పెద్దలు నిర్ణయించినట్లు తెలిసింది.
Similar News
News October 22, 2025
మెదక్: రాయితీపై విత్తనాలు పంపిణీ: కలెక్టర్

రేగోడ్ రైతు వేదికలో మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో రాయితీ పై ప్రొద్దు తిరుగుడు, శనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ మాట్లాడుతూ.. యాసంగి 2025-26 సీజన్కు గజ్వాడ గ్రామంలో 50 ఎకరాల్లో బ్లాక్ లెవెల్ డెమో చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ADA టెక్నికల్ జి.విన్సెంట్ వినయ్, ADA ఇన్ఛార్జ్ రాంప్రసాద్, MAO మొహమ్మద్ జావీద్, MRO దత్తు రెడ్డి పాల్గొన్నారు.
News October 21, 2025
MDK: మంజీరా నదిలో ఒకరి మృతి.. మరొకరి గల్లంతు

మెదక్ మండలం పేరూరు శివారులో మంజీరా వాగులో పడి బాలుడు మృతి చెందగా, రక్షించేందుకు దిగిన మరో వ్యక్తి గల్లంతయ్యాడు. గ్రామస్థుల వివరాలు.. పేరూరు గ్రామానికి చెందిన చింతకింది అంజమ్మ నిన్న మృతి చెందింది. ఈరోజు సాయంత్రం అంత్యక్రియల అనంతరం మంజీరాలో స్నానం చేసేందుకు దిగగా కృష్ణ (16) కాలుజారి పడిపోయాడు. కృష్ణ రక్షించేందుకు బీరయ్య వాగులో దిగి గల్లంతయ్యాడు. కృష్ణ మృతదేహం లభ్యం కాగా, బీరయ్య కోసం గాలిస్తున్నారు.
News October 21, 2025
మెదక్: 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు

పాపన్నపేట మండలం పొడ్చన్ పల్లి గ్రామానికి చెందిన అరక అజయ్ కుమార్ 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.
అరక జ్యోతి, సంజీవరావు కుమారుడు అజయ్ కుమార్ 2018లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, పంచాయతి కార్యదర్శిగా విధుల్లో చేరాడు. తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే లోకో పైలట్, ఆర్ఎస్ఐ, కానిస్టేబుల్, 2023లో ఎస్ఐ, గ్రూప్-2లో ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం సాధించాడు.