News January 31, 2025
శనివారం HYDలో కృష్ణా జలాలు బంద్

HYDలో ఫిబ్రవరి ఒకటో తేదీన కృష్ణా జలాలు బంద్ కానున్నాయి. నల్లగొండ జిల్లాలోని నాసర్లపల్లి సబ్స్టేషన్లోని 132 KV బల్క్ లోడ్ ఫీడర్ పీటీఆర్ మరమ్మతులకు గురైంది. దీంతో నాగార్జున్సాగర్లోని కోదండాపూర్లోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. దీనికి TG ట్రాన్స్కో అధికారులు శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గం. వరకు మరమ్మతులు చేయనున్నారు.
Similar News
News July 11, 2025
కొత్తగూడెం: మొన్న గల్లంతు.. నేడు మృతదేహం లభ్యం.!

మణుగూరు మండలం బాంబే కాలనీ సమీపంలోని రేగుల గండి చెరువులో సింగరేణి ఉద్యోగి సుంకరి శ్రీనివాస్ స్నేహితులతో ఈతకు వెళ్లి బుధవారం గల్లంతయ్యారు. గురువారం NDRF బృందాలు, రెస్క్యూ టీం సాయంతో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. శ్రీనివాస్ మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
News July 11, 2025
HYD: కల్తీ కల్లు తాగి ఎనిమిది మంది మృతి

కల్తీ కల్లు <<17017648>>రాజేసిన అగ్గి<<>> ఇంకా చల్లారడంలేదు. ఈ ప్రమాదపు కల్లు తాగి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ పెద్ద గంగారాం (70) అర్ధరాత్రి 1:30కు గాంధీ హాస్పిటల్లో మృతి చెందాడు. కూకట్పల్లి PS పరిధిలోని ఆదర్శనగర్లో ఆయన నివాసం ఉండేవారు. ఈయన మరణంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. 30 మందికి పైగా వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొంతుతున్నారు.
News July 11, 2025
మీ పిల్లలూ స్కూల్కి ఇలాగే వెళుతున్నారా?

పిల్లలను స్కూళ్లకు పంపేందుకు పేరెంట్స్ ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా డబ్బులకు ఆశపడి వాహనదారులు లెక్కకుమించి విద్యార్థులను ఎక్కిస్తున్నారు. దీంతో పిల్లల ప్రయాణం ప్రమాదకరంగా సాగుతోంది. రవాణాశాఖ అధికారులు ఇలాంటి వాహనాలపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాల్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.