News March 7, 2025

శరభన్నపాలెం సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడి మృతి

image

వైసీపీ సీనియర్ నేత, కొయ్యూరు మండలం శరభన్నపాలెం సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడు లోకుల సోమగాంధీ శుక్రవారం ఉదయం మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించి మరణించారని కుటుంబీకులు తెలిపారు. శరభన్నపాలెం గ్రామానికి చెందిన సోమ గాంధీ వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎంపీటీసీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.

Similar News

News November 27, 2025

NARFBRలో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని ICMR-నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ ( NARFBR)7 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD/MS, PhD, B.V.Sc&AH, MVSc, ఫార్మా డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. CBT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC/ST/Women/PWD/EWSలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://narfbr.org/

News November 27, 2025

ఆదిలాబాద్: సర్పంచ్ స్థానానికి ఏకగ్రీవ తీర్మాణం

image

ఇంద్రవెల్లి మండలంలోని తేజపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ స్థానాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. సర్పంచ్‌తో పాటు 8 మంది వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం తేజపూర్ పరిధిలోని సాలెగూడ, డోబ్బిగూడ, తేజపూర్ గ్రామ పటేల్‌ల ఆధ్వర్యంలో సమావేశమై, కోవా రాజేశ్వర్‌ను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్వచ్ఛందంగా ఎన్నికలు నిర్వహించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

News November 27, 2025

BREAKING: సత్యసాయి జిల్లాలో బాలుడి హత్య

image

తలుపుల మండల పరిధిలోని గరికపల్లిలో నాలుగేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొమ్మెర హర్షవర్ధన్ అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు బుధవారం సాయంత్రం PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నంబులపూలకుంట(M) గౌకన పేట అడవీ ప్రాంతంలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.