News March 21, 2025

శాంతిభద్రతలపై హోం మంత్రి సమీక్ష

image

విజయవాడ డీజీపీ కార్యాలయంలో శుక్రవారం హోం మంత్రి వంగలపూడి అనిత శాంతి భద్రతలపై సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ హరీష్ గుప్తాతో కలిసి జిల్లాల ఎస్పీలతో వివిధ అంశాలపై సమీక్షించానన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటులో పురోగతిని జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. మహిళలపై నేరాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News October 14, 2025

నిర్మల్: జిన్నింగ్ మిల్లుల్లో అగ్నిమాపక పరికరాలు తప్పనిసరి

image

మంగళవారం సాయంత్రం అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ అభిలాష అభినవ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మిల్లులలో తప్పనిసరిగా అగ్నిమాపక పరికరాలు సహా అవసరమైన అన్ని వసతులు ఉండేలా చూడాలని ఆదేశించారు. వే బ్రిడ్జీలకు నిర్ణీత గడువులోపు స్టాంపింగ్ చేయించుకోవాలని సూచించారు. రైతులు పంటలు అమ్మిన వెంటనే నిర్ణీత గడువులోపు వారికి డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

News October 14, 2025

వాస్తుతో సంతోషకర జీవితం

image

ఇంటి వాస్తు బాగుంటేనే ఇంట్లో ఉండేవారందరూ సంతోషంగా ఉంటారని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘వాస్తు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. తద్వారా మంచి నిద్ర, విశ్రాంతి లభిస్తాయి. సామాజిక బంధాలను మెరుగుపరిచే ఆలోచనలు తెస్తాయి. అవి అవకాశాలను మోసుకొచ్చి ఆదాయాన్ని పెంచుతాయి. దీంతో ఆనందం కలుగుతుంది. సంతోషకరమైన జీవితానికి వాస్తు మూల కారణం’ అని అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News October 14, 2025

ఉత్కంఠ పోరు.. భారత్, పాక్ మ్యాచ్ డ్రా

image

మలేషియాలో జరుగుతున్న సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్-2025 U21 హాకీ టోర్నీలో భారత్, పాక్‌ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఇరు జట్లు 3-3 గోల్స్ చేశాయి. ఒక దశలో 0-2తో వెనుకబడిన IND చివర్లో అద్భుతంగా పోరాడి 3-2‌తో లీడ్‌లోకి వెళ్లింది. విజయం ఖాయమనుకున్న సమయంలో పాక్ గోల్ కొట్టి లెవెల్ చేసింది. ఇప్పటికే బ్రిటన్, న్యూజిలాండ్‌పై గెలిచిన IND పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో కొనసాగుతోంది.