News March 21, 2025
శాంతిభద్రతలపై హోం మంత్రి సమీక్ష

విజయవాడ డీజీపీ కార్యాలయంలో శుక్రవారం హోం మంత్రి వంగలపూడి అనిత శాంతి భద్రతలపై సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ హరీష్ గుప్తాతో కలిసి జిల్లాల ఎస్పీలతో వివిధ అంశాలపై సమీక్షించానన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటులో పురోగతిని జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. మహిళలపై నేరాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News November 15, 2025
గ్రేటర్లో కారు జోరు తగ్గుతోందా?

TG: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో BRSకు గ్రేటర్ హైదరాబాద్ బలంగా ఉంది. అధికారాన్ని కోల్పోయినా గ్రేటర్ HYD పరిధిలోనే 16 సీట్లు గెలుచుకుంది. అయితే ఆ తర్వాత 2024 కంటోన్మెంట్ ఉపఎన్నికలో మాత్రం చతికిలపడింది. లాస్యనందిత సోదరి నివేదితను బరిలోకి దించగా కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. తాజాగా జూబ్లీహిల్స్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. దీంతో గ్రేటర్లో కారు జోరు తగ్గుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News November 15, 2025
మెదక్: నేడు జిల్లాలో కవిత పర్యటన ఇదే

మెదక్ జిల్లాలో రెండవ రోజు శనివారం కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట షెడ్యూల్ ఈవిధంగా ఉంది. హవేలి ఘన్పూర్ మండలం కూచన పల్లిలో పాడి రైతులతో సమావేశం
2.రమేష్ కుటుంబ సభ్యుల పరామర్శ,
3.మెదక్లో ప్రెస్ మీట్,
4.మేధావులతో సమావేశం, బూరుగుపల్లి, రాజుపేట, వాడి, దూప్ సింగ్ తండాలో వరద బాధితుల పరామర్శ, 5.పొలంపల్లిలో కేవల్ కిషన్, చిన్నశంకరంపేట అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు.
News November 15, 2025
సనాతనం అంటే ఏంటి? అది ఏం బోధిస్తుంది?

సనాతనం అంటే శాశ్వతంగా, నిరంతరం ఉండేది అని అర్థం. అందుకే దీన్ని సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మ శాస్త్రాలు మనిషికి ముఖ్యంగా రెండు విషయాలను బోధిస్తున్నాయి. అవి సరైన జీవన విధానం, జీవిత లక్ష్యం. ఈ రెండూ తెలియకుండా జీవించడం వ్యర్థం. అందుకే జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని ధర్మార్థ కామ మోక్షాలు అనే పురుషార్థాల ద్వారా ఎలా పొందవచ్చో మన శాస్త్రాలు స్పష్టంగా నిర్దేశిస్తున్నాయి. <<-se>>#Sanathanam<<>>


