News April 13, 2025
శాంతి భద్రతలపై దృష్టి సారించండి: ఎస్పీ

శాంతిభద్రతలు కాపాడి, నేరాలు జరగకుండా నిరోధించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. మదనపల్లె డీఎస్పీగా శనివారం బాధ్యతలు స్వీకరించిన మహీంద్ర జిల్లా ఎస్పీని కలిసి జాయినింగ్ రిపోర్టు అందజేశారు. ఎస్పీ సబ్ డివిజన్ పరిధిలో ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉండటం పోలీసు శాఖకు చాలా అవసరం అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా నేరాల నియంత్రణపై దృష్టిసారించాలన్నారు
Similar News
News December 8, 2025
చలితో ఉమ్మడి వరంగల్ గజ గజ!

వరంగల్ నగరంలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి సమయంలో 12 డిగ్రీలు ఉంటోంది. వచ్చే మూడు రోజుల్లో కనీస ఉష్ణోగ్రతలు 10-11 డిగ్రీల వరకు ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ములుగులో 12, భూపాలపల్లిలో 12.1, జనగామలో 12.4, మహబూబాబాద్లో 13, వరంగల్ జిల్లాలో 12 డిగ్రీలకు చేరింది. గత రెండు రోజులుగా చలి తీవ్రత పెరగడంతో జనం వణికిపోతున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు.
News December 8, 2025
అరకు: ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

అరకులోయ మండలం ఇరగాయి పంచాయతీ పరిధి ఉరుములులో ఎలుగుబంటి దాడిలో గిరిజనుడికి తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అప్పారావు గ్రామ సమీపంలోని కాఫీ తోటకి కాపలగా వెళ్లాడు. ఆదివారం అర్ధరాత్రి ఓ ఎలుగుబంటి అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. క్షతగాత్రుడిని 108లో విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఎలుగుబంట్లు పొలాల్లోకి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
News December 8, 2025
మెదక్: రెండో విడతలో ఏడు పంచాయతీలు ఏకగ్రీవం

మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఏడు సర్పంచి స్థానాలు, 254 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 8 మండలాల్లో 142 సర్పంచి, 1,035 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచి పదవులు ఏకగ్రీవమైన వాటిలో వెల్దుర్తి మండలం షౌకత్ పల్లి, నగరం, బస్వాపూర్, మెదక్ మండలం మల్కాపూర్ తండా, చిన్న శంకరంపేట మండలం మాందాపూర్ తండా, గవలపల్లి తండా, సంగాయపల్లి ఏకగ్రీవం అయ్యియి.


