News December 21, 2024
శాతవాహన యూనివర్సిటీ పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల
గత మూడు సంవత్సరాల నుంచి యూనివర్సిటీలో ఎలాంటి పీహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వని కారణంగా వేల మంది విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారని ఇటీవల జేఏసీ ఛైర్మన్ చెన్నమల్ల చైతన్య ఆధ్వర్యంలో వీసీ దృష్టికి తీసుకెళ్ళారు. శనివారం వీసీ ఉమేష్ కుమార్ పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల జేఏసీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. వీసీ కి జేఏసీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News January 21, 2025
సిరిసిల్ల: బిందెలో ఇరుక్కున్న ఓ చిన్నారి తల
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సంజీవయ్యనగర్లో ఓ చిన్నారి తల నీళ్ల బిందెలో ఇరుక్కుంది. ఎంత ప్రయత్నించినా బిందెలో నుంచి పాప తల బయటికి రాకపోవడంతో బిందెను జాగ్రత్తగా కత్తిరించి పాప తలను జాగ్రత్తగా బయటకు తీశారు. ఈ ఘటనలో పాపకు ఎలాంటి ప్రమాదం కాలేదు. ఇంత జరుగుతున్నా ఆ చిన్నారి ఏడవకుండా ధైర్యంతో ఉండడానికి చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
News January 21, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.90,177 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.37,948 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.44,260, అన్నదానం రూ.7,969,వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
News January 21, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేపటినుండి గ్రామసభలు. @ మెట్పల్లి మండలంలో బాలిక అదృశ్యం.. కేసు నమోదు. @ భీమదేవరపల్లి మండలంలో గంజాయి సేవిస్తున్న నలుగురిపై కేసు. @ ముత్తారం మండలంలో ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య. @ వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలలో పోలీసుల తనిఖీలు. @ ఇబ్రహీంపట్నం మండలంలో పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య. @ గణతంత్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాటు చేయాలన్న జగిత్యాల అడిషనల్ కలెక్టర్.