News April 8, 2025
శాతవాహన వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!

శాతవాహన యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 39మంజూరు పోస్టులకు గాను 16మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 21 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
Similar News
News April 21, 2025
త్వరలో తులం బంగారం రూ.1.25 లక్షలు?

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కారణంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ యుద్ధం మరింత తీవ్రమైతే 2025 చివరినాటికి బంగారం ధర ఔన్స్కు $4500కి చేరుకోవచ్చని ప్రముఖ ట్రేడ్ దిగ్గజం ‘గోల్డ్మన్ సాచ్స్’ పేర్కొంది. ఔన్స్ ధర $4500 అయితే భారత మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ.1.25 లక్షలకు చేరుకుంటుంది. కాగా, ఇవాళ తొలిసారి బంగారం రూ.లక్షను టచ్ చేసిన విషయం తెలిసిందే. SHARE IT
News April 21, 2025
భూ సమస్యల కోసమే భూభారతి: ASF కలెక్టర్

భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. KZR మండలం వంజీరి రైతు వేదికలో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంలోని హక్కులు, అంశాలపై రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. భూభారతి రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. రికార్డులలో ఏదైనా తప్పుల సవరణకు తహశీల్దార్ కార్యాలయంలో సరి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
News April 21, 2025
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షాక్

వరుస ఓటములతో ఇబ్బందుల్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఈనెల 24న RCBతో జరిగే మ్యాచుకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన గాయం నుంచి కోలుకుంటున్నారని, జట్టుతో బెంగళూరుకు వెళ్లకుండా జైపూర్లోని హోమ్ బేస్లో ఉంటారని RR ధ్రువీకరించింది. భవిష్యత్తు మ్యాచుల్లో ఆడతారా? లేదా? అన్నది సంజూ కోలుకోవడంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.