News April 8, 2025
శాతవాహన వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ!

శాతవాహన యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 39 మంజూరు పోస్టులకు గాను 16 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 21 ఖాళీలు ఉన్నాయి. అకడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా వీటిలో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.
Similar News
News December 5, 2025
జగిత్యాల: జిల్లా స్థాయి పీఎం శ్రీ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

జగిత్యాల జిల్లా స్థాయి పీఎం శ్రీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ను వివేకానంద మినీ స్టేడియంలో అడిషనల్ కలెక్టర్ బి.ఎస్.లత ప్రారంభించారు. జిల్లాలోని 16 పీఎం శ్రీ పాఠశాలలకు చెందిన 900 మంది విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్ పోటీలలో పాల్గొన్నారు. ఆటలు విద్యార్థుల్లో ఆరోగ్యం, మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని లత తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాము, రాజేష్, చక్రధర్, విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
News December 5, 2025
సిరిసిల్ల: ‘మెరుగైన వైద్య సేవలు అందించాలి’

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలో స్టాఫ్ నర్సులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ MLHPలతో ఆమె శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజిత మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలన్నారు. సకాలంలో లక్ష్యాలు సాధించాలని పేర్కొన్నారు.
News December 5, 2025
రాజకీయాల్లోకి రమ్మని లోకేశ్ను ఫోర్స్ చేయలేదు: CBN

AP: పిల్లల్లోని ఇన్నోవేటివ్ ఆలోచనలు గుర్తించేందుకు స్టూడెంట్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తామని CM CBN PTMలో తెలిపారు. ‘నేనెప్పుడూ లోకేశ్ స్కూలుకు వెళ్లలేదు. టీచర్లతోనూ మాట్లాడలేదు. ఫౌండేషన్ ఇప్పించానంతే. చదువుకొని మంత్రి అయ్యారు. రాజకీయాల్లోకి రమ్మనీ ఫోర్స్ చేయలేదు’ అని అన్నారు. కష్టంగా ఉంటుందన్నా విద్యాశాఖనే ఎంచుకున్నారని చెప్పారు. విద్యార్థులు కలలు సాకారం చేసుకొనేలా అండగా ఉంటామన్నారు.


