News December 26, 2024

శానంపూడిలో యువతి ఆత్మహత్య 

image

సింగరాయకొండ మండలంలో నవ వధువు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. పాలపర్తి అమూల్య అనే యువతికి శానంపూడి గ్రామానికి చెందిన తగరం గోపీ కృష్ణతో 40 రోజుల క్రితం వివాహం జరిగింది. గురువారం అమూల్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వేధింపులు భరించలేకే యువతి ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 24, 2025

కర్నూల్ ప్రమాదం.. ప్రకాశం ట్రావెల్స్ బస్సులు సేఫేనా?

image

కర్నూల్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు <<18087723>>ప్రవేట్ ట్రావెల్స్<<>> బస్సులను ఆశ్రయిస్తారు. ఘటనలు జరిగినప్పుడు ఈ ట్రావెల్స్ బస్సులు ఎంత వరకు సేఫ్ అన్నదానిపై చర్చ నడుస్తోంది. కర్నూల్ వద్ద ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్‌నెస్ గడువు తీరిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రకాశంలో ట్రావెల్స్ బస్సులు అంతా ఫిట్‌గా ఉన్నాయా.?

News October 24, 2025

ప్రకాశం జిల్లాలో నేడు స్కూళ్లకు సెలవులు

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గురువారం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నేడు (శుక్రవారం) అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇస్తూ జిల్లా కలెక్టర్ రాజాబాబు ప్రకటించారు. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో సెలవులు ఇచ్చామని, ఈ నిర్ణయాన్ని ప్రతి పాఠశాల యాజమాన్యం పాటించాలన్నారు.

News October 24, 2025

ప్రకాశం జిల్లాలోని పత్తి సాగు రైతులకు గుడ్ న్యూస్

image

జిల్లాలోని పత్తి సాగు రైతులకు JC గోపాలకృష్ణ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు జేసీ కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. మార్కాపురంలోని మార్కెట్ యార్డులో ప్రభుత్వ మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేసేందుకు ఆయన నిర్ణయించారు. నవంబర్ నుంచి పత్తి పంట కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని, జిల్లాలోని రైతులు ఈ విషయాన్ని గమనించాలని ప్రకటన విడుదలైంది. ఈ క్రాప్ చేయించుకున్న రైతులు మాత్రమే అర్హులుగా తెలిపారు.