News February 14, 2025
శావల్యాపురంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

శావల్యాపురంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని గుంటూరు-కర్నూలు రహదారిపై సోసైటీ కార్యాలయం వద్ద గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం 108 సిబ్బంది వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News October 31, 2025
VIRAL: అప్పుడు గంభీర్.. ఇప్పుడు జెమీమా

ఉమెన్స్ ODI వరల్డ్ కప్ సెమీస్లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన జెమీమా రోడ్రిగ్స్ను నెటిజన్లు గంభీర్తో పోలుస్తున్నారు. 2011 WC ఫైనల్లో మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన గంభీర్ 97 రన్స్ చేసి IND విజయంలో కీలక పాత్ర పోషించారు. నిన్నటి మ్యాచులో జెమీమా సైతం మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశారు. ఇద్దరి జెర్సీ నంబర్ ఒకటే కావడం(5), ఇద్దరి జెర్సీలకు మట్టి ఉండటంతో వారి ఫొటోలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.
News October 31, 2025
గుంటూరు అబ్బాయి.. పోలాండ్ అమ్మాయి

గుంటూరులో గురువారం జరిగిన ఓ లవ్ మ్యారేజ్ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. పెదకాకాని యువకుడు పృధ్వీ కృష్ణ, పోలాండ్కు చెందిన పత్రీశియా పరస్పర ప్రేమతో ఒక్కటయ్యారు. కుటుంబ పెద్దల అంగీకారంతో, ఈ విదేశీ వధువుకు హిందూ సంప్రదాయంలో పెళ్లి చేశారు. సరిహద్దులు లేని ఈ ప్రేమ బంధం, రెండు సంస్కృతుల కలయికకు, యువతకు ఆదర్శంగా నిలిచిందని స్థానికులు కొనియాడారు.
News October 31, 2025
విశాఖ: బెట్టింగ్ యాప్.. మరో ఇద్దరి అరెస్ట్

బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇప్పటికే పలువురు బెట్టింగ్ యాప్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా అచ్యుతాపురం మండలం చీమలపల్లికి చెందిన పెయ్యల త్రినాథ్, హరిపాలేనికి చెందిన కసిరెడ్డి బాల సంజీవరావు కొంతకాలంగా బెట్టింగ్ యాప్లు నడుపుతున్నారని సమాచారం ఇచ్చారు. దీంతో వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు.


